త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ATA | తెలుగు మహాసభలకు రండి.. సీఎం రేవంత్‌కు అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆహ్వానం..!

ATA | అమెరికాలో వచ్చే ఏడాది నిర్వహించనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ తెలుగు మహాసభలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏటీఏ ప్రతినిధులు ఆహ్వానించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఏటీఏ ప్రతినిధి బృందం జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు వివరించింది.

P

Telangana | Published On May 25, 2026, 10.14 pm IST

ATA | తెలుగు మహాసభలకు రండి.. సీఎం రేవంత్‌కు అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆహ్వానం..!

ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు రావాలంటూ.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్షరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు

Advertisement
  • ముఖ్యమంత్రి గారూ..ఆటా మహాసభలకు రండి

  • ఆహ్వానం పలికి ఆటా మహాసభల ప్రతినిధులు

  • ఈ ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు

  • 19వ ఆటా సభలు

త్రినేత్ర.న్యూస్ : అమెరికాలోని మేరీలాండ్ లో జరగనున్న ఆటా మహా సభలకు హాజరు కావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు రావాలంటూ.. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్షరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు

బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో

అమెరికాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆటా పేరు ప్రఖ్యాతులు గాంచిన విషయం తెలిసిందే. తెలుగు సంస్కృతి, భాష, విద్య, యువత సాధికారిత, వ్యాపార నెట్ వర్కింగ్ వంటి అంశాల్లో అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ మానవతా సేవను ఆటా నిరంతరం ప్రోత్సహిస్తున్నది. కాగా ఈ 19వ ఆటా సభలు ఈ సారి మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లోని రెనైసాన్స్ హార్బర్ ప్లేస్ హోటల్ లో జరగనున్నాయి. 4,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న ఈ స్పేస్ లో అనేక సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాళ్లు, స్థానిక హోటళ్లు ఉన్నాయి.

ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు

ఆటా మహా సభలకు దాదాపు 10 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. ఈ ఏడాది జూలై 31 నుంచి జరగబోయే 19వ మహాసభలకు గత ఏడాది అక్టోబర్ లోనే సన్నాహక సమావేశాలు జరిగాయి. కిక్ ఆఫ్ ఈవెంట్ పేరుతో జరిగిన ఈ సన్నాహక సమావేశాలకు తెలుగు వారైన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. అంతే కాదు 1.4 మిలియన్ డాలర్ల నిధులను కూడా సేకరించారు.

Advertisement
Advertisement