త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | మేడారంలో అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన సీఎం.. మ‌న‌వ‌డితో క‌లిసి మొక్కులు చెల్లించుకున్న రేవంత్‌.. ఫొటోలు

Revanth Reddy | మేడారంలో (Medaram) ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడేలా పునఃనిర్మించిన సమ్మ‌క్క‌, సార‌ల‌మ్మ ఆల‌యాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) భక్తులకు అంకితం చేశారు. వ‌న‌దేవ‌త‌ల‌ గ‌ద్దెలు, ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు.

G

Telangana | Published On Jan 19, 2026, 7.48 am IST

Revanth Reddy | మేడారంలో అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన సీఎం.. మ‌న‌వ‌డితో క‌లిసి మొక్కులు చెల్లించుకున్న రేవంత్‌.. ఫొటోలు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మేడారంలో (Medaram) ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడేలా పునఃనిర్మించిన సమ్మ‌క్క‌, సార‌ల‌మ్మ ఆల‌యాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) భక్తులకు అంకితం చేశారు. వ‌న‌దేవ‌త‌ల‌ గ‌ద్దెలు, ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. మంత్రుల‌తో క‌లిసి గ‌ద్దెల పైలాన్‌ను ఆవిష్క‌రించారు. కుటుంబ స‌మేతంగా వ‌ణ‌దేవ‌త‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మ‌న‌వ‌డితో క‌లిసి నిలువెత్తు బంగారాన్ని స‌మర్పించారు. దీంతో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతరను (Medaram Jatara) లాంఛనంగా ప్రారంభించిన‌ట్ల‌యింది. ఈ కార్య‌క్ర‌మంలో ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టివిక్ర‌మార్క‌, మంత్రులు పాల్గొన్నారు.

ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. సోమ‌వారం ఉద‌యం ఆలయ అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించారు. తొలుత అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

రాతిశిలలతో అభివృద్ధి పనులకు ప్రాణం పోయగా, 4 వేల టన్నుల గ్రానైట్​పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసేలా 7 వేల చిత్రాలను అందంగా చిత్రీకరించారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ నిర్మాణ పనులు ఆదివాసీల మూలాలు జాతర చరిత్రను కళ్లకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీటవేస్తూ చరిత్రను వందల ఏండ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement