త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Prajavani | సీఎం ప్ర‌జావాణిలో 325 ద‌ర‌ఖాస్తులు.. స‌మ‌స్య‌లు తెలుసుకున్న చిన్నారెడ్డి

CM Prajavani | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన 217వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 325 దరఖాస్తులు వ‌చ్చాయి. ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించే ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన వినతులు పెద్ద సంఖ్యలో వచ్చాయి.

P

Telangana | Published On Apr 28, 2026, 8.01 pm IST

CM Prajavani | సీఎం ప్ర‌జావాణిలో 325 ద‌ర‌ఖాస్తులు.. స‌మ‌స్య‌లు తెలుసుకున్న చిన్నారెడ్డి
Advertisement

CM Prajavani | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన 217వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 325 దరఖాస్తులు వ‌చ్చాయి. ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించే ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన వినతులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 92 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు 40, ఇందిరమ్మ ఇళ్ల కోసం 106, ఇతర శాఖలకు సంబంధించి మరో 87 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి దరఖాస్తులను స్వీకరించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సూర్య ప్రకాశ్‌, ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్ర‌వాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement