త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Trains | హైద‌రాబాద్ నుంచి 8 కొత్త రైళ్లు.. వ‌చ్చే నెల నుంచి సేవ‌లు ప్రారంభం..

New Trains | రైల్వే ప్ర‌యాణికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణకు 8 కొత్త రైళ్లను (New Trains) ప్రకటించింది.

G

Telangana | Published On Apr 22, 2026, 9.22 am IST

New Trains | హైద‌రాబాద్ నుంచి 8 కొత్త రైళ్లు.. వ‌చ్చే నెల నుంచి సేవ‌లు ప్రారంభం..
Advertisement

New Trains | త్రినేత్ర‌.న్యూస్‌: రైల్వే ప్ర‌యాణికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణకు 8 కొత్త రైళ్లను (New Trains) ప్రకటించింది. ఇవి హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు (ఏపీ), భువనేశ్వర్‌ (ఒడిశా), జైపుర్‌ (రాజస్థాన్‌), శ్రీగంగానగర్‌ (రాజస్థాన్‌) వంటి ముఖ్యమైన గమ్యస్థానాలకు సేవ‌లు అందిస్తాయి. ఈ కొత్త వీక్లీ స్పెషల్‌ రైళ్లకు ఇప్ప‌టికే రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. వ‌చ్చె నెల నుంచి ద‌శ‌ల‌వారీగా ఈ స‌ర్వీలులు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త సర్వీసులు ఇవే..

  • 17067/17068 నంబరుతో.. ప్రతి సోమవారం సాయంత్రం 6.10 గంట‌లకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. మే 5న ప్రారంభం కానుంది.
  • 17047/17048 నంబరుతో.. చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 7 నుంచి సేవ‌లు అందిస్తుంది.
  • 17059/17060 నంబరుతో.. ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 11 నుంచి ప్రారంభం కానుంది.
  • 17441/17442 నంబరుతో.. చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 14న ప్రారంభమ‌వుతుంది.
  • 17607/17608 నంబరుతో.. కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30 గంటలకు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15న
  • 17443/17444 నంబరుతో.. చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి
  • 17601/17602 నంబరుతో.. కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ జూలై 14 నుంచి
  • 17079/17080 నంబరుతో.. ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement