త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సాయి ఈశ్వ‌ర్ మృతిప‌ట్ల కేటీఆర్ నివాళి

KTR | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిందని సాయి ఈశ్వ‌ర్ అనే యువ‌కుడు ప్రాణ‌త్యాగం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈశ్వ‌ర్ ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు మౌనం వహించి నివాళులర్పించారు.

S

Telangana | Published On Dec 6, 2025, 7.24 am IST

KTR | సాయి ఈశ్వ‌ర్ మృతిప‌ట్ల కేటీఆర్ నివాళి
Advertisement

KTR | హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిందని సాయి ఈశ్వ‌ర్ అనే యువ‌కుడు ప్రాణ‌త్యాగం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈశ్వ‌ర్ ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు మౌనం వహించి నివాళులర్పించారు.

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర్‌ చారి(38) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ ప్రాంతంలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌(తీన్మార్‌ మల్లన్న)కు చెందిన క్యూన్యూస్‌ కార్యాలయం వద్ద సాయి ఈశ్వర్‌ చారి గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. శరీరంపై కిరోసిన్‌ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఈశ్వర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి ప్రాంతంలోని పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్‌ చారి.. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలోని బీరప్పనగర్‌లో నివాసముంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేసేవారు. ఆయనకు భార్య కవిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement