త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | శ‌భాష్ కాంగ్రెస్.. కేటీఆర్ ట్వీట్

KTR | నిన్న రాత్రి సైఫాబాద్ పోలీసు స్టేష‌న్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్‌వో మ‌హేశ్‌, పీఏ మ‌హేంద‌ర్ రెడ్డిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు మూక‌దాడికి పాల్ప‌డ్డార‌ని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

S

Telangana | Published On Sep 15, 2026, 7.05 am IST

KTR | శ‌భాష్ కాంగ్రెస్.. కేటీఆర్ ట్వీట్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : నిన్న రాత్రి సైఫాబాద్ పోలీసు స్టేష‌న్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్‌వో మ‌హేశ్‌, పీఏ మ‌హేంద‌ర్ రెడ్డిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు మూక‌దాడికి పాల్ప‌డ్డార‌ని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మూక‌దాడి ఘ‌ట‌న‌పై కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. శ‌భాష్ కాంగ్రెస్ అంటూ ఆయ‌న పేర్కొన్నారు.

మూక‌దాడులు అనేవి ఎల్ల‌ప్పుడూ ప్రాణాలు తీసే చ‌ర్య‌తోనే ప్రారంభం కాదు.. కొన్ని సార్లు పోలీసు అధికారుల ముందే, పోలీసు స్టేష‌న్ లోప‌ల ప‌క్కా ప్ర‌ణాళిక‌తో జ‌ర‌గొచ్చు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం గూండాయిజానికి ఏ విధంగానైతే మ‌ద్ద‌తు ఇచ్చి ప్రోత్స‌హించ‌డాన్ని చూస్తుంటే.. త్వ‌ర‌లోనే వీధుల్లో మూక‌దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నాను. విచార‌ణ నిమిత్తం పోలీసు స్టేష‌న్ లోప‌ల ఉన్న‌ప్పుడే నా పీఆర్వో మ‌హేశ్‌, పీఏ మ‌హేంద‌ర్ రెడ్డిపై జ‌రిగిన మూక‌దాడులు.. రేపు తెలంగాణ‌లోని సాధార‌ణ పౌరుడిపై కూడా జ‌ర‌గొచ్చు. తెలంగాణ రాష్ట్రం ప్ర‌స్తుతం తీవ్ర‌మైన అరాచ‌క‌త్వం అంచున ఉంది.. వెల్ డ‌న్ కాంగ్రెస్ అంటూ కేటీఆర్ త‌న పోస్టులో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు.

Advertisement
Advertisement