Komatireddy Venkat Reddy | తప్పకుండా మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలి: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy | తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు తప్పనిసరిగా ధన్యవాదాలు తెలపాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ (KTR) చేసిన ప్రసంగానికి సమాధానమిస్తూ కోమటిరెడ్డి బీఆర్ఎస్ (BRS)పై విమర్శలు గుప్పించారు.
Komatireddy Venkat Reddy | త్రినేత్ర.న్యూస్ : తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు తప్పనిసరిగా ధన్యవాదాలు తెలపాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ (KTR) చేసిన ప్రసంగానికి సమాధానమిస్తూ కోమటిరెడ్డి బీఆర్ఎస్ (BRS)పై విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని, తాము రేషన్ కార్డులు మంజూరు చేసి, సన్నబియ్యం సైతం ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో అంతర్జాతీయ హోటళ్ల స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, అవి పూర్తి కావస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 278 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణాలు చేసినందుకు 11 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. ప్రతి గ్రామాల్లో 30-40 ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నారన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలని సూచించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేసినందుకు, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టినందుకు బీఆర్ఎస్కు కృతజ్ఞతలు తెలపాలా అని ఎద్దేవా చేశారు. పేదవర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అప్పుల బారిన పడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ముందుకు పోతున్నామని అన్నారు. రిజర్వాయర్లు నిర్మించారని, కానీ భూసేకరణ చేయలేదని, ప్రాజెక్టులు లేవని, నీళ్లు లేవని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన రూ. మూడు లక్షల ఇరవై అయిదు కోట్ల అప్పులు కట్టి, రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సందర్భంగా తప్పనిసరిగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





