KTR | ముఖ్యమంత్రి తొలి సంతకానికి జీరో వాల్యూ : కేటీఆర్
KTR | ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేశానని మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ ఉందని కేటీఆర్ విమర్శించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేశానని మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ ఉందని కేటీఆర్ విమర్శించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
నిన్న సీఎం మాట్లాడుతూ.. జీరో వాల్యూ చేశాను ప్రజల ఆస్తులను అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ఆ ఫైలుకు జీరో వాల్యూ. మీ గ్యారెంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ. మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ. మూసీలో మీరు ముంచుతున్న ఇండ్లకు కాదు.. విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.
ఇది నా కవిత్వం కాదు.. ఆరు గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజీ అడ్వటైజ్మెంట్. వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని పెద్ద యాడ్ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారెంటీలతో అందే ప్రయోజనాల విలువ 2 లక్షల 50 వేలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి రెండున్నరేండ్లు అయింది ఒక్క కుటుంబానికైనా రూ. 2 లక్షల 50 వేలు అందినట్లు చూపించే సత్తా మీ ప్రభుత్వానికి ఉందా..? అని కేటీఆర్ నిలదీశారు.
పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆది శ్రీనివాస్ చెప్పారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే సభలో మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 వరకు ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చారని చెప్పారు. మరి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో విబేధిస్తున్నారా..? సభలో మంత్రులు చెప్పిన మాటలకు విలువ లేకపోతే ఎలా.. అని కేటీఆర్ ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



