త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Governor | ఇది స‌హ‌కార సంఘాల చ‌ట్టానికి విరుద్ధం.. గ‌వ‌ర్న‌ర్‌కు బీఆర్ఎస్ నేత‌ల ఫిర్యాదు

Governor | రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని చూస్తోంది.. ఇది సహకార సంఘాల చట్టానికి విరుద్ధం అని మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత మ‌ధుసూద‌నాచారి ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On May 30, 2026, 5.16 pm IST

Governor | ఇది స‌హ‌కార సంఘాల చ‌ట్టానికి విరుద్ధం.. గ‌వ‌ర్న‌ర్‌కు బీఆర్ఎస్ నేత‌ల ఫిర్యాదు
Advertisement

Governor | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని చూస్తోంది.. ఇది సహకార సంఘాల చట్టానికి విరుద్ధం అని మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత మ‌ధుసూద‌నాచారి ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌కార సంఘాల చైర్మ‌న్లు, సింగిల్ విండో చైర్మ‌న్ల‌ను కొన‌సాగించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

లోక్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన అనంత‌రం మధుసూదనా చారి మీడియాతో మాట్లాడుతూ.. 2020లో గెలిచిన చైర్మన్లు పదవీకాలం 2025 వరకు ఉంది. ఎన్నికలు జరపకుండా తమకు అనుకూలంగా ఉన్న వారిని నామినేట్ చేయాలని చూస్తోంది. ఈ అంశంపై గవర్నర్‌కు వినతి పత్రం అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని గవర్నర్ హామీ ఇచ్చారని మ‌ధుసూద‌నాచారి తెలిపారు.

Advertisement
Advertisement