త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Sudarshan Reddy | రేవంత్ రెడ్డి 420 ముఖ్య‌మంత్రి : పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి

Peddi Sudarshan Reddy | రేవంత్ రెడ్డి 420 ముఖ్య‌మంత్రి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

S

Telangana | Published On Apr 22, 2026, 1.58 pm IST

Peddi Sudarshan Reddy | రేవంత్ రెడ్డి 420 ముఖ్య‌మంత్రి : పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి
Advertisement

Peddi Sudarshan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి 420 ముఖ్య‌మంత్రి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయలేదు. రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్‌ను ఇరికించాలని భావించారు. రాజకీయ దుష్ప్రచారం కోసం కాళేశ్వరం కమీషన్ రిపోర్టును రేవంత్ రెడ్డి వాడుకున్నారు అని పెద్ది ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రంలో మొక్క జొన్న పంట కొనే దిక్కు లేదు. మొక్క జొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. లక్షలాది మంది మొక్కజొన్న రైతులను నిండా ముంచుతున్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రైతులు ప్రయివేటు వ్యాపారుల వద్ద మోసపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మార్క్ ఫెడ్ సంస్థను కుదువపెట్టి రూ. 22 వేల కోట్ల అప్పు తెచ్చారు. మార్క్ ఫెడ్ కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్నలకు ఎట్లా చెల్లింపులు చేస్తారు. కేసీఆర్‌ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లాగా మార్క్ ఫెడ్‌లో దందాలు చేశారని సుద‌ర్శ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

టెస్కో ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు బ‌ట్ట‌లు సప్లై చేసేవారు. టెస్కోలో 50 వేల మంది సభ్యులు ఉన్నారు. టెస్కో సప్లై ఆర్డర్ జీబో నంబర్ 1ను రద్దు చేసి రాజేష్ కార్పోరేషన్‌కు టెండర్లు దక్కే విధంగా చేశారు. రాజేష్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన సంస్థ. దీనిపై హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వం పిచ్చి నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీని ఇక నుంచి వదిలి పెట్టం అని పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement