త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | రణరంగంలోకి కేసీఆర్.. లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం

KCR | అసెంబ్లీ స‌మావేశాలు ముగియ‌గానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రణ‌రంగంలోకి వ‌స్తార‌ని, ల‌క్ష‌లాది మందితో ప్ర‌త్య‌క్ష ఉద్య‌మానికి శ్రీకారం చుడుతార‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు.

S

Telangana | Published On Sep 6, 2026, 6.25 pm IST

KCR | రణరంగంలోకి కేసీఆర్.. లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : అసెంబ్లీ స‌మావేశాలు ముగియ‌గానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రణ‌రంగంలోకి వ‌స్తార‌ని, ల‌క్ష‌లాది మందితో ప్ర‌త్య‌క్ష ఉద్య‌మానికి శ్రీకారం చుడుతార‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ముగిసిన అనంత‌రం హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

రాబోయే కొద్ది రోజుల్లో, ఈ అసెంబ్లీ స‌మావేశాలు ముగియ‌గానే కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల విష‌యంలో నిర్ల‌క్ష్య ధోర‌ణిని నిర‌సిస్తూ ల‌క్ష‌లాది మంది రైతుల‌తో కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌త్య‌క్ష ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. పాల‌మూరు ఎత్తిపోత‌ల విష‌యంలో కూడా ప్ర‌త్య‌క్ష పోరాటానికి దిగాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ప‌ట్ల‌ నిర్ల‌క్ష్య వైఖ‌రికి, రైతాంగానికి చేస్తున్న ద్రోహానికి ప్ర‌త్య‌క్ష పోరాటానికి కేసీఆరే స్వ‌యంగా నాయ‌క‌త్వం వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement