త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | సైకిళ్లిచ్చారు.. చిన్నారుల్లో ఉత్సాహం నింపారు

Jagga Reddy | చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చ‌దువు ప‌ట్ల ఆస‌క్తిని పెంచడ‌మే ల‌క్ష్యంగా టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ముందుకెళ్తున్నారు. ఐదేళ్ల నుంచి 15 ఏండ్ల మ‌ధ్య ఉన్న పిల్ల‌ల‌కు సైకిళ్లు అందించి వారిలో ఉత్సాహం నింపారు.

S

Telangana | Published On Jun 6, 2026, 5.04 pm IST

Jagga Reddy | సైకిళ్లిచ్చారు.. చిన్నారుల్లో ఉత్సాహం నింపారు
Advertisement
  • సంగారెడ్డిలో 210 మంది చిన్నారుల‌కు అంద‌జేసిన‌ జ‌గ్గారెడ్డి

Jagga Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చ‌దువు ప‌ట్ల ఆస‌క్తిని పెంచడ‌మే ల‌క్ష్యంగా టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే 400 మంది చిన్నారుల‌కు సైకిళ్లు అంద‌జేయ‌గా శ‌నివారం సంగారెడ్డిలోని పీఎస్సార్ గార్డెన్‌లో మ‌రో 210 మంది చిన్నారుల‌కు సైకిళ్లు పంపిణీ చేశారు. ఐదేళ్ల వ‌య‌సు నుంచి 15 ఏండ్ల మ‌ధ్య ఉన్న పిల్ల‌ల‌కు సైకిళ్లు అందించి వారిలో ఉత్సాహం నింపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. గత వారం టోకెన్‌లు ఇచ్చిన వారికి సైకిళ్లు అంద‌జేశాం. టోకెన్‌లు లేని చిన్నారులకు మరోసారి సైకిళ్లు పంపిణీ చేస్తాం. అందరి చిన్నారుల ఆధార్ కార్డు, పేరెంట్స్ ఫోన్ నెంబర్ల‌తో కూడిన వివరాలు తీసుకోవాలని నిర్వాహకులకు చెప్పాను. సైకిళ్లు రాని చిన్నారులు ఎవరూ ఆందోళన చెందొద్దు. పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తాం అని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement