త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Internship Scheme 2026 | 10 పాస్ అయితే చాలు.. నెలకు రూ. 9,000 స్టైపెండ్ : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ మూడో విడత షురూ!

నిరుద్యోగ యువతకు కేంద్రం శుభవార్త. నెలకు రూ. 9,000 స్టైపెండ్‌తో 'పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్' మూడో విడత దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇవే.

J

Telangana | Published On Aug 29, 2026, 8.55 pm IST

PM Internship Scheme 2026 | 10 పాస్ అయితే చాలు.. నెలకు రూ. 9,000 స్టైపెండ్ : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ మూడో విడత షురూ!

సంక్షిప్త సారాంశం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PMIS) పైలట్ ప్రాజెక్ట్ మూడో విడత దరఖాస్తులు కొనసాగుతున్నాయి. టాప్ 2000 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తుండగా, ఎంపికైన యువతకు నెలకు రూ. 9,000 స్టైపెండ్‌తో పాటు, వన్-టైమ్ గ్రాంట్‌గా రూ. 6,000 అందిస్తారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న 18-25 ఏళ్ల వయసున్న యువతీయువకులు ఈ స్కీమ్‌కు అర్హులు. తెలంగాణలో ఇప్పటివరకు సుమారు 53,243 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,385 మంది ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయ్యారు.

Advertisement

PM Internship Scheme 2026 | త్రినేత్ర.న్యూస్ : చదువు పూర్తయినా సరైన ఉద్యోగం రాలేదని బాధపడుతున్న నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) ఆధ్వర్యంలో అమలవుతున్న 'ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్' (PMIS) మూడో విడత దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం ఉత్సాహంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ (Industries & Commerce Dept) దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ఉన్న టాప్ 2000 కంపెనీల్లో యువతకు ప్రాక్టికల్ ట్రైనింగ్‌తో పాటు ఆకర్షణీయమైన స్టైపెండ్ అందించనున్నారు.

అర్హతలు, ప్రయోజనాలు ఇవే..

స్టైపెండ్ డీటెయిల్స్: ఎంపికైన అభ్యర్థులకు 6 లేదా 9 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ కాలంలో నెలకు రూ. 9,000 చొప్పున స్టైపెండ్ (Stipend), అలాగే జాయిన్ అయినప్పుడు వన్-టైమ్ గ్రాంట్‌ కింద అదనంగా మరో రూ. 6,000 అందిస్తారు.

వయసు, ఆదాయం: 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల కంటే తక్కువ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

విద్యార్హత: 10వ తరగతి, ఇంటర్ (12th), ఐటీఐ (ITI), పాలిటెక్నిక్, డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ స్కీమ్‌కు అర్హులే.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు పీఎంఐఎస్ అఫీషియల్ పోర్టల్ (https://pminternship.mca.gov.in/) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లై చేయడానికి మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ, ఆధార్ ఇ-కేవైసీ (Aadhaar e-KYC) తప్పనిసరి. ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్‌కు కచ్చితంగా ఆధార్ లింక్ (Aadhaar seeded bank account) అయి ఉండాలి.

ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసిన తర్వాత, పోర్టల్‌లో ఉన్న కంపెనీల జాబితా నుంచి మీకు నచ్చిన గరిష్టంగా 3 ఇంటర్న్‌షిప్ అవకాశాలకు (Apply upto 3 internships) దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణలో విశేష స్పందన

ఆగస్టు 29, 2026 నాటికి తెలంగాణలో ఈ స్కీమ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 53,243 మంది యువత పోర్టల్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇందులో 30,626 మంది దరఖాస్తు చేసుకోగా, వివిధ కంపెనీల నుంచి 30,153 ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 1,385 మంది అభ్యర్థులు ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయ్యారు. ఇటీవల జూలై 26, 2026 న కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఇన్ఫోసిస్ క్యాంపస్ డ్రైవ్'లో ఏకంగా 250 మంది తెలంగాణ యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు దక్కడం విశేషం.

హెల్ప్‌లైన్ వివరాలు

ఈ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే పీఎంఐఎస్ టోల్-ఫ్రీ నంబర్ 1800116090 కి కాల్ చేయవచ్చు. దరఖాస్తులో సాయం కావాలనుకునే వారు.. హైదరాబాద్ అబిడ్స్‌లోని 'కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్' కార్యాలయంలో కానీ, జిల్లాల్లోని 'డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్' (DIC) జనరల్ మేనేజర్‌ను కానీ నేరుగా సంప్రదించవచ్చని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ జె. నిఖిల్ చక్రవర్తి స్పష్టం చేశారు. స్కీమ్ అమలును పర్యవేక్షించేందుకు స్టేట్, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement