త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | ‘ప్ర‌జ‌ల తెలంగాణ’ దిశ‌గా ముందుకు సాగుతాం : మ‌ల్లికార్జున ఖ‌ర్గే

Mallikarjun Kharge | ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల స‌మావేశం ముగిసింది.

S

Telangana | Published On Feb 19, 2026, 4.00 pm IST

Mallikarjun Kharge | ‘ప్ర‌జ‌ల తెలంగాణ’ దిశ‌గా ముందుకు సాగుతాం : మ‌ల్లికార్జున ఖ‌ర్గే
Advertisement

Mallikarjun Kharge | త్రినేత్ర‌.న్యూస్ : ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల స‌మావేశం ముగిసింది. సుమారు 2 గంట‌ల పాటు కొన‌సాగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్‌గౌడ్‌తో పాటు ప‌లువురు మంత్రులు పాల్గొన్నారు. భేటీ అనంత‌రం ఖ‌ర్గే ఎక్స్‌లో పోస్టు చేశారు.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. ఏఐసీసీ తెలంగాణ నాయకులు, మంత్రులతో సమగ్ర సమీక్ష నిర్వహించాం. “ప్రజల తెలంగాణ” దిశగా ముందుకు సాగేందుకు తదుపరి కార్యాచరణపై చర్చించాము. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం మా సంకల్పం. మా హామీల్లో అది స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రతి పౌరుడి ఆశయాలను సాకారం చేస్తూ, నిజమైన సమగ్ర తెలంగాణ నిర్మాణానికి మేము నిరంతరం కృషి చేస్తాం అని మ‌ల్లికార్జున ఖ‌ర్గే పేర్కొన్నారు.

https://x.com/kharge/status/2024375034069041449

Advertisement
Advertisement