త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | తెలంగాణను అభివృద్ధిప‌థంలో న‌డిపించేందుకు స‌హ‌క‌రించండి.. అడోబ్ సీఈవోను కోరిన సీఎం రేవంత్‌

Revanth Reddy | రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మ‌రింత‌ సహకరించాలని అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్ బోర్డ్ స‌భ్యుడు శంత‌ను నారాయ‌ణ్‌ను (Shantanu Narayen) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు.

G

Telangana | Published On Feb 25, 2026, 1.04 pm IST

Revanth Reddy | తెలంగాణను అభివృద్ధిప‌థంలో న‌డిపించేందుకు స‌హ‌క‌రించండి.. అడోబ్ సీఈవోను కోరిన సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మ‌రింత‌ సహకరించాలని అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్ బోర్డ్ స‌భ్యుడు శంత‌ను నారాయ‌ణ్‌ను (Shantanu Narayen) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని శంత‌ను నారాయ‌ణ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు చ‌ర్చించారు.

గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్‌ రీస్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపై సీఎంతో చ‌ర్చించారు. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలని, దీనికోసం కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంత‌ను నారాయ‌ణ్‌తో చర్చించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement