త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | పెళ్లైన మ‌రుస‌టి రోజే పెళ్లాన్ని కొట్టి.. మ‌న‌స్తాపంతో ఉరేసుకున్న న‌వ వ‌రుడు

Suicide | మూడు ముళ్లు.. ఏడ‌డుగులు వేసి మూడు రోజులు కూడా కాలేదు. ఆలోపే న‌వ దంప‌తుల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఆగ్ర‌హంతో న‌వ వ‌ధువును కొట్టాడు. ఆ త‌ర్వాత మ‌న‌స్తాపంతో న‌వ వ‌రుడు ఉరేసుకున్నాడు.

S

Telangana | Published On Feb 24, 2026, 9.34 am IST

Suicide | పెళ్లైన మ‌రుస‌టి రోజే పెళ్లాన్ని కొట్టి.. మ‌న‌స్తాపంతో ఉరేసుకున్న న‌వ వ‌రుడు
Advertisement

Suicide | త్రినేత్ర‌.న్యూస్ : మూడు ముళ్లు.. ఏడ‌డుగులు వేసి మూడు రోజులు కూడా కాలేదు. ఆలోపే న‌వ దంప‌తుల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఆగ్ర‌హంతో న‌వ వ‌ధువును కొట్టాడు. ఆ త‌ర్వాత మ‌న‌స్తాపంతో న‌వ వ‌రుడు ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న నారాయ‌ణ‌పేట జిల్లాలోని న‌ర్వ మండ‌లంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. న‌ర్వ మండ‌ల కేంద్రానికి చెందిన చాక‌లి గోవిందమ్మ‌, కృష్ణ‌య్య దంప‌తుల కుమారుడు చాక‌లి ర‌వికి క‌ర్నూల్ న‌గ‌రానికి చెందిన యువ‌తితో ఈ నెల 20న వివాహ‌మైంది. 21వ తేదీన ఇరువురు దంప‌తులు గొడ‌వ‌ప‌డ్డారు. క్ష‌ణికావేశంలో ఆగ్ర‌హంతో భార్య‌ను కొట్ట‌డంతో.. ఆమె కుప్ప‌కూలింది. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు.. న‌వ వ‌ధువును చికిత్స నిమిత్తం న‌ర్వ పీహెచ్‌సీకి త‌ర‌లించారు. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం మ‌క్త‌ల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఈలోపే విష‌యం వ‌ధువు కుటుంబ స‌భ్యుల‌కు తెలిసింది. న‌ర్వ‌కు వ‌చ్చిన వారు వ‌రుడి కుటుంబ స‌భ్యుల‌తో వాగ్వాదానికి దిగారు. అనారోగ్యం బారిన పడిన వధువును కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవి సోమవారం ఉదయం 6 గంటలకు పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. న‌వ వ‌రుడి ఆత్మ‌హ‌త్య‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

 

Advertisement
Advertisement