త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | మ‌తాల‌ను కించ‌ప‌ర‌చ‌కుండా త్వ‌రలోనే చ‌ట్టం: మ‌హేష్ కుమార్ గౌడ్‌

Mahesh Kumar Goud | రాష్ట్రంలో ఏ మ‌తాన్నీ కించ‌ప‌ర‌చ‌కుండా సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో త్వ‌ర‌లోనే చ‌ట్టం తీసుకురాబోతున్న‌ట్లు టీపీసీసీ (TPCC) అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ (MLC) మ‌హేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు.

A

Telangana | Published On Dec 25, 2025, 4.15 pm IST

Mahesh Kumar Goud | మ‌తాల‌ను కించ‌ప‌ర‌చ‌కుండా త్వ‌రలోనే చ‌ట్టం: మ‌హేష్ కుమార్ గౌడ్‌
Advertisement

Mahesh Kumar Goud | రాష్ట్రంలో ఏ మ‌తాన్నీ కించ‌ప‌ర‌చ‌కుండా సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో త్వ‌ర‌లోనే చ‌ట్టం తీసుకురాబోతున్న‌ట్లు టీపీసీసీ (TPCC) అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ (MLC) మ‌హేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. గచ్చిబౌలి ప్రాంతంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో (Christmas Celebrations) ఆయ‌న‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపంత్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఇందిరా, పాస్టర్ బెంజిమన్ తదితరులు పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ క్రైస్తవులకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి దేవుడని చెప్పారు. దేశంలో ప్రతి పౌరుడికి తన మతాన్ని, తన దేవుడిని ప్రార్థించే సంపూర్ణ స్వేచ్ఛ ఉందన్నారు. యువత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జీసస్ జీవితం, ఆయన చరిత్ర మానవాళికి గొప్ప సందేశమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మానవాళి ఉన్నంతకాలం జీసస్ ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారని చెప్పారు. అన్ని మతాలను సమానంగా, గౌరవంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మేన‌న్నారు.

Advertisement
Advertisement