త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | నీకు మ‌గ‌త‌నం లేదు.. నాకొద్దురా మొగుడా..!

Suicide | కొత్త‌గా పెళ్లైంది.. ఇక సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌నుకున్నాడు. కానీ భార్య నుంచి ఊహించ‌ని మాట వినిపించింది. పెళ్లైన మూడు రోజుల‌కే.. నువ్వు మ‌గాడివి కాదు.. నీకు మ‌గ‌త‌నం లేదు.. నాకొద్దురా మొగుడా నువ్వు అని భ‌ర్త‌ను హింసించింది భార్య‌.

S

Telangana | Published On Jul 20, 2026, 1.34 pm IST

Suicide | నీకు మ‌గ‌త‌నం లేదు.. నాకొద్దురా మొగుడా..!
Advertisement

Suicide | త్రినేత్ర‌.న్యూస్ : కొత్త‌గా పెళ్లైంది.. ఇక సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌నుకున్నాడు. కానీ భార్య నుంచి ఊహించ‌ని మాట వినిపించింది. పెళ్లైన మూడు రోజుల‌కే.. నువ్వు మ‌గాడివి కాదు.. నీకు మ‌గ‌త‌నం లేదు.. నాకొద్దురా మొగుడా నువ్వు అని భ‌ర్త‌ను హింసించింది భార్య‌. ఇంకేముంది మూడు నెల‌ల పాటు మాన‌సిక వేద‌న అనుభ‌వించిన ఆ భ‌ర్త‌.. చివ‌ర‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా ర‌ఘునాథ‌పాలెం మండ‌లంలో వెలుగు చూసింది.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన స‌ద‌ర్‌లాల్‌(27) తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేసేవాడు. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన యువతిని స‌ద‌ర్‌లాల్ వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లైన‌ మూడో రోజు నుండే నీకు మగతనం లేదని భ‌ర్త‌ను భార్య వేధింపులకు గురి చేసింది. అయినా కూడా ఆమె హింస‌ను భ‌రించాడు. మూడు నెల‌ల పాటు మాన‌సిన వేద‌న అనుభ‌వించాడు.

అత్తింట్లో అవ‌మానం.. బావ‌కు ఫోన్ చేసి ఆత్మ‌హ‌త్య‌

ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తగారింటికి వెళ్లగా, కుటుంబ సభ్యులతో కలిసి సదర్ లాల్‌ను భార్య అవ‌మానించింది. తీవ్ర మనస్తాపానికి గురైన స‌ద‌ర్‌లాల్.. త‌న‌ అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పి, బావకు ఫోన్ చేశాడు. తాను చనిపోతున్నానని చెప్పి బావ‌కు లొకేషన్ పంపాడు. దీంతో వి. వెంకటాయపాలెం కాలువ దగ్గరికి వెళ్లి చూడగా, అక్కడ సదర్ లాల్ బైక్, ఫోన్, కలుపు మందు డబ్బాను గుర్తించారు. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు స‌మాచారం అందించారు కుటుంబ స‌భ్యులు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు కాలువ‌లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి డెడ్‌బాడీని వెలికితీశారు. మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మెడిక‌ల్ టెస్టులు కూడా

అయితే పెళ్లికి ముందే యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని, పెళ్లయ్యాక కూడా సంబంధం కొనసాగించేందుకే సదర్ లాల్‌కు మగతనం లేదని పంచాయతీ పెడితే, మెడికల్ టెస్టులు చేయించామని సదర్ లాల్ కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement