త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chicken Piece | 45 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాల‌ను బలి తీసుకున్న కోడి కూర ముక్క‌

Chicken Piece | కోడి కూర ముక్క ఓ 45 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాల‌ను బలి తీసుకుంది. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌ల ప‌రిధిలోని గొల్ల‌ప‌ల్లిలో చోటు చేసుకుంది.

S

Telangana | Published On Dec 8, 2025, 4.23 pm IST

Chicken Piece | 45 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాల‌ను బలి తీసుకున్న కోడి కూర ముక్క‌
Advertisement

Chicken Piece | రాజ‌న్న సిరిసిల్ల : కోడి కూర ముక్క ఓ 45 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాల‌ను బలి తీసుకుంది. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌ల ప‌రిధిలోని గొల్ల‌ప‌ల్లిలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గొల్ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన పాటి సురేంద‌ర్(45) త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గొల్ల‌ప‌ల్లిలోని కేసీఆర్ డ‌బుల్ బెడ్రూం కాల‌నీలో నివాసం ఉంటున్నారు. ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూనే ఇంటి ద‌గ్గ‌ర ఓ కిరాణం షాపును కూడా నిర్వ‌హిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి కోడి కూర తింటుండ‌గా.. సురేంద‌ర్ గొంతులో ఓ ముక్క ఇరికింది. దీంతో ఆయ‌న‌కు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ఏర్ప‌డింది. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు.. బాధితుడి గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క‌ను బ‌య‌ట‌కు తీసేందుకు య‌త్నించారు. కానీ ఆ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. కాసేప‌టికే సురేంద‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ స‌భ్యుల క‌ళ్ల ముందే సురేంద‌ర్ క‌న్నుమూశాడు. దీంతో కుటుంబ స‌భ్యులంద‌రూ శోకసంద్రంలో మునిగిపోయారు. సురేంద‌ర్‌కు భార్య క‌విత‌, ఇద్ద‌రు కుమార్తెలు రుచిత‌, శిరీష ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement