Team India | తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడనున్నది భారత్..!
Team India | భారత క్రికెట్ జట్టు మరో విదేశీ టెస్ట్ సిరీస్కు సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా షెడ్యూల్ను ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 27 వరకు రెండు టెస్టుల సిరీస్ జరగనుంది.
Team India | భారత క్రికెట్ జట్టు మరో విదేశీ టెస్ట్ సిరీస్కు సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా షెడ్యూల్ను ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 27 వరకు రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025–2027 సీజన్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో స్థానం మెరుగుపరుచుకోవాలన్న లక్ష్యంతో భారత్, శ్రీలంక జట్లు ఈ సిరీస్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. స్పిన్కు అనుకూలించే గాలే పిచ్పై ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతుంది. రెండు మ్యాచ్లు కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 48.15 విజయాల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఫలితాలు ర్యాంకింగ్స్పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. గతసారి శ్రీలంకలో భారత్ టెస్ట్ సిరీస్ ఆడింది 2017లోనే. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆ పర్యటనలో టీమిండియా 3–0 తేడాతో శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ అదే గడ్డపై టెస్ట్ సిరీస్ జరగడం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు..! సంకేతాలిచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్
జులై 2, 2026

H-FAST | మటన్లో బీఫ్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
జులై 2, 2026

Kacheguda Railway Station | 110 ఏళ్లు పూర్తి చేసుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్.. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికీకరణలో ముందంజ
జులై 2, 2026
తాజావార్తలు
- ●Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు..! సంకేతాలిచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్
- ●DGP Anand | మున్సిపల్, రెవెన్యూ, కోర్టుల పరిధిలను పరిగణనలోకి తీసుకోండి
- ●Jana Nayagan | రిలీజ్కు ముందే కోటి మంది చూశారట - లీకుల్లో జననాయగన్ రికార్డ్
- ●Bandi Sanjay | కాంగ్రెస్, బీఆర్ఎస్లది 'బిగ్ బాస్' డ్రామా : కేంద్ర మంత్రి బండి సంజయ్
- ●South India Temple Run | హైదరాబాద్ నుంచి విమానంలో దక్షిణాది టూర్: ఐఆర్సీటీసీ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' ప్యాకేజీ పూర్తి వివరాలివే!
- ●H-FAST | మటన్లో బీఫ్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Petrol-Diesel Price | పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు..! సంకేతాలిచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్

DGP Anand | మున్సిపల్, రెవెన్యూ, కోర్టుల పరిధిలను పరిగణనలోకి తీసుకోండి

Jana Nayagan | రిలీజ్కు ముందే కోటి మంది చూశారట - లీకుల్లో జననాయగన్ రికార్డ్

Bandi Sanjay | కాంగ్రెస్, బీఆర్ఎస్లది 'బిగ్ బాస్' డ్రామా : కేంద్ర మంత్రి బండి సంజయ్



