త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs NZ | రాజ్‌కోట్ వ‌న్డేలో చెల‌రేగిన న్యూజిలాండ్ బ్యాట‌ర్లు.. టీమిండియా టార్గెట్ 338 ర‌న్స్‌

IND Vs NZ | రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో వ‌న్డేలో టీమిండియాకు న్యూజిలాండ్ 338 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు తొలుత బౌల‌ర్లు శుభారంభం అందించారు.

P

Sports | Published On Jan 18, 2026, 6.05 pm IST

IND Vs NZ | రాజ్‌కోట్ వ‌న్డేలో చెల‌రేగిన న్యూజిలాండ్ బ్యాట‌ర్లు.. టీమిండియా టార్గెట్ 338 ర‌న్స్‌
Advertisement

IND Vs NZ | రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో వ‌న్డేలో టీమిండియాకు న్యూజిలాండ్ 338 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు తొలుత బౌల‌ర్లు శుభారంభం అందించారు. ఒక ద‌శ‌లో 58 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో ప‌డ్డ న్యూజిలాండ్ జ‌ట్టును డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. ఇద్ద‌రు శ‌త‌కాల మోత మోగించ‌డంతో ఆ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 337 ప‌రుగులు చేసింది.

మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 137 ప‌రుగులు, ఫిలిప్స్ 88 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 106 ప‌రుగులతో రాణించారు. ఇద్ద‌రు క‌లిసి నాలుగో వికెట్‌కు 188 బంతుల్లో 219 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. ఇద్ద‌రు క్రీజులో కుదురుకోవ‌డంతో ఆ జ‌ట్టు భారీ స్కోర్ సాధించ‌గ‌లిగింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రు అవుట్ అవ‌డంతో కాస్త స్కోర్ త‌గ్గింది. చివ‌ర‌లో కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ సైతం విరుచుకుప‌డ‌డంతో స్కోర్ 330 ప‌రుగులు దాటింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement