త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC | 2028 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు నేరుగా అర్హ‌త సాధించిన 12 జ‌ట్లు ఇవే.. ఐసీసీ ప్ర‌క‌ట‌న‌..

ICC | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 సూప‌ర్ 8 ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో 2028 లో జ‌ర‌గ‌నున్న త‌దుపరి టోర్నీ కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028కు అర్హ‌త సాధించిన జ‌ట్ల వివ‌రాల‌ను ఐసీసీ తెలియ‌జేసింది. వ‌చ్చే టోర్నీకి నేరుగా అర్హ‌త సాధించిన 12 జ‌ట్ల వివ‌రాల‌ను తెలిపింది.

S

Cricket | Published On Feb 20, 2026, 9.40 am IST

ICC | 2028 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు నేరుగా అర్హ‌త సాధించిన 12 జ‌ట్లు ఇవే.. ఐసీసీ ప్ర‌క‌ట‌న‌..
Advertisement

ICC | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 సూప‌ర్ 8 ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో 2028 లో జ‌ర‌గ‌నున్న త‌దుపరి టోర్నీ కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028కు అర్హ‌త సాధించిన జ‌ట్ల వివ‌రాల‌ను ఐసీసీ తెలియ‌జేసింది. వ‌చ్చే టోర్నీకి నేరుగా అర్హ‌త సాధించిన 12 జ‌ట్ల వివ‌రాల‌ను తెలిపింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028 టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యం ఇస్తుండ‌గా ఆతిథ్య దేశాలు అయినందున ఈ జ‌ట్లు ఆ టోర్నీకి నేరుగా అర్హ‌త సాధించాయి. ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టోర్నీలో సూప‌ర్ 8కు చేరుకున్న జ‌ట్ల‌న్నీ ఆటోమేటిగ్గా వ‌చ్చే టోర్నీకి కూడా అర్హ‌త‌ను పొందాయి. మ‌రో మూడు స్థానాలకు మాత్రం మార్చి 9, 2026ను క‌టాఫ్ తేదీగా ఐసీసీ ప్ర‌క‌టించింది. ఆ లోపు టీ20 ర్యాంకింగ్స్‌ను బ‌ట్టి ఆ మూడు స్థానాల‌కు అర్హ‌త పొందే జ‌ట్ల‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్‌, ఆఫ్గ‌నిస్థాన్‌, ఐర్లాండ్ జ‌ట్లు ఆ మూడు స్థానాల‌ను ద‌క్కించుకోనున్నాయి.

ఐసీసీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, శ్రీ‌లంక దేశాలు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028కు అర్హ‌త సాధించాయి. బంగ్లాదేశ్‌, ఆఫ్గ‌నిస్థాన్‌, ఐర్లాండ్ జ‌ట్లు ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ మిగిలిన మూడు స్థానాల్లో అర్హ‌త పొంద‌నున్నాయి. ఇక టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 దశ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుండ‌గా ఇందులో గ్రూప్ ఎ లో భారత్, వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక గ్రూప్ బి లో న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక పోటీ ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సెమీఫైనల్స్‌కు చేరతాయి. సెమీఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరగనున్నాయి. ఫైనల్ ను మార్చి 8వ తేదీన నిర్వ‌హిస్తారు. ఇక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028లో 12 జ‌ట్లు పోను మిగిలిన 8 స్థానాలకు వచ్చే రెండేళ్లలో అర్హత టోర్నమెంట్లు జరగనున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement