త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDW Vs SLW | మ‌హిళ‌ల టీ20 మ్యాచ్‌.. శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం..

INDW Vs SLW | విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి మ‌హిళ‌ల‌ టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. ఆరంభంలో కాస్త నెమ్మ‌దిగా ఆడినా త‌రువాత దూకుడు పెంచారు. ఈ క్ర‌మంలో ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండ‌గానే భార‌త్ ల‌క్ష్యాన్ని ఛేదించింది.

S

Sports | Published On Dec 21, 2025, 10.16 pm IST

INDW Vs SLW | మ‌హిళ‌ల టీ20 మ్యాచ్‌.. శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం..
Advertisement

INDW Vs SLW | విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి మ‌హిళ‌ల‌ టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. ఆరంభంలో కాస్త నెమ్మ‌దిగా ఆడినా త‌రువాత దూకుడు పెంచారు. ఈ క్ర‌మంలో ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండ‌గానే భార‌త్ ల‌క్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ గెలిచిన అనంత‌రం మ‌ళ్లీ భార‌త్ ఈ సిరీస్‌తో మైదానంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలోనే శుభారంభం అందుకుంది. ఫీల్డింగ్‌లో ఇంకా మెరుగు ప‌డాల్సి ఉన్నా బౌలింగ్‌లో మాత్రం స‌త్తా చాటారు. శ్రీ‌లంక వికెట్ల‌ను తీస్తూ ఆ ప్లేయ‌ర్ల‌పై ఒత్తిడి పెంచారు. దీంతో వారు నిర్ణీత ఓవ‌ర్ల‌లో త‌క్కువ స్కోరు చేశారు. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక నిర్దేశించిన 122 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ అల‌వోక‌గా ఛేదించింది. శ్రీ‌లంక‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా శ్రీ‌లంక జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఈ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో ఓపెన‌ర్ విష్మి గుణ‌ర‌త్నె 43 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స‌ర్‌తో 39 ప‌రుగులు చేయ‌గా, మిగిలిన ప్లేయ‌ర్లు ఎవ‌రూ ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో క్రాంతి గౌడ్‌, దీప్తి శ‌ర్మ‌, శ్రీ‌చ‌ర‌ణిల‌కు త‌లా 1 వికెట్ దక్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 14.4 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లను కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. 122 పరుగులు చేసింది. భార‌త జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచ‌రీలో ఆక‌ట్టుకుంది. 44 బంతుల్లో 10 ఫోర్ల‌తో జెమీమా 69 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, ఓపెన‌ర్ స్మృతి మంధాన 25 బంతుల్లో 4 ఫోర్ల‌తో 25 ప‌రుగులు చేసింది. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో కావ్య క‌వింది, ఇనోకా ర‌ణ‌వీర‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది. మొత్తం 5 టీ20ల సిరీస్‌లో భాగంగా జ‌రిగిన ఈ తొలి మ్యాచ్‌లో విజ‌యంతో భార‌త్ సిరీస్‌లో ఆధిక్యంలోకి చేర‌గా, ఈ నెల 23వ తేదీన ఇరు జ‌ట్ల మ‌ధ్య మ‌ళ్లీ ఇదే వేదిక‌లో రెండో టీ20 మ్యాచ్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement