A Jeevan Reddy BRS | బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి? పుకార్లపై ఘాటుగా స్పందించిన గులాబీ నేత
తాను బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.
A Jeevan Reddy BRS | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతున్న వేళ, బీఆర్ఎస్ (BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (A.Jeevan Reddy) పార్టీ మారుతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమైందని, త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని కొన్ని వార్తా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, అందులో ఎలాంటి వాస్తవం లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ వెంటే..
తాను జీవితంలో ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీని వీడనని, బీజేపీతో సహా మరే ఇతర పార్టీలో చేరే ప్రసక్తే లేదని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. "నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాటను వీడను. నా చివరి శ్వాస వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తాను. నేను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్. నా రాజకీయ గురువు, నా ఆరాధ్య దైవం కేసీఆర్ (KCR)" అని ఆయన ఉద్వేగంగా ప్రకటించారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి భేటీ అంతా కట్టుకథే
తాను బీజేపీలో చేరడానికి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని (Pralhad Joshi) కలిసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. "నేను ఏ కేంద్ర మంత్రిని కలవలేదు. అసలు నేను ఢిల్లీకే వెళ్ళలేదు, ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నాను. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే నాపై ఈ దుష్ప్రచారం" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫేక్ ప్రచారం చేస్తే జైలుకే
తన ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు (Fake News) మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో తప్పుడు వార్తలు రాసిన వారిపై, ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావాతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటానని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ప్రత్యక్షమైన బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి
ఆర్మూర్ బీజేపీ నేతలతో కలిసి కేంద్రమంత్రితో జీవన్ రెడ్డి రహస్య మంతనాలు
జీవన్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారా? అని రాజకీయ వర్గాల్లో మొదలైన జోరుగా చర్చ
కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా మాజీ… pic.twitter.com/qBCOpgCmK3
— BIG TV Breaking News (@bigtvtelugu) April 22, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





