త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | మా ప్రాంతం పేరు లేకుండా.. మా అస్తిత్వం దెబ్బతీసేలా చేస్తున్న రేవంత్‌: మాజీ మంత్రి త‌ల‌సాని

Talasani Srinivas Yadav |

G

News | Published On Jan 17, 2026, 12.05 pm IST

Talasani Srinivas Yadav | మా ప్రాంతం పేరు లేకుండా.. మా అస్తిత్వం దెబ్బతీసేలా చేస్తున్న రేవంత్‌: మాజీ మంత్రి త‌ల‌సాని
Advertisement

త్రినేత్ర‌.న్యూస్ : సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా అని స‌న‌త్‌న‌గ‌ర్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) ప్ర‌శ్నించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లు అంటున్నార‌ని, త‌మ‌ ప్రాంతం పేరు లేకుండా, త‌మ అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారని మండిప‌డ్డారు. చారిత్ర‌క‌ సికింద్రాబాద్‌తో త‌మ‌కు ఉన్న‌ది మ‌ట్టి సంబంధ‌మ‌ని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కు త‌మ‌కు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

పోలీసులు మొదట శాంతి ర్యాలీకి అనుమతి ఇచ్చారని చెప్పారు. రాత్రికి రాత్రే వేలాది మంది పోలీసులు మోహరించి ర్యాలీకి అనుమతి లేదంటూ త‌మ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ర్యాలీ కోసం ఐదు రోజుల క్రిత‌మే అనుమ‌తి కోరామ‌ని, కానీ శుక్ర‌వారం రాత్రి 10.40 గంట‌ల‌కు అనుమతి లేదని పోలీసులు చెప్పారన్నారు. ముందే ర్యాలీకి అనుమ‌తి లేద‌ని చెబితే తాము కోర్టుకు వెళ్లి ప‌ర్మిష‌న్ తెచ్చుకునే వాళ్లం.

అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్ళే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ వాళ్లేమో ఇస్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారని.. ప్రతిపక్షాలను మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాత్కాలికంగా త‌మ శాంతిర్యాలీ అడ్డుకుని పైశాచిక ఆనందం పొందవచ్చు.. కానీ న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement