త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | టీపీసీసీ ప్రొటోకాల్‌-కోఆర్డినేష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌గా వేణుగోపాల్ రావు

Mahesh Kumar Goud | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రొటోకాల్-కోఆర్డినేషన్ కమిటీ (Protocol-coordination committee)ని పునర్‌వ్యవస్థీకరించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రకటించారు. కమిటీకి చైర్మన్‌గా హార్కర వేణుగోపాల్ రావు (Venugopal Rao)ను నియమించారు.

S

News | Published On Apr 19, 2026, 5.32 pm IST

Mahesh Kumar Goud | టీపీసీసీ ప్రొటోకాల్‌-కోఆర్డినేష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌గా వేణుగోపాల్ రావు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రొటోకాల్-కోఆర్డినేషన్ కమిటీ (Protocol-coordination committee)ని పునర్‌వ్యవస్థీకరించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రకటించారు. ఈ మేర‌కు ఆదివారం హైద‌రాబాద్‌(Hyderabad)లోని గాంధీ భ‌వ‌న్‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా హార్కర వేణుగోపాల్ రావు (Venugopal Rao)
ను నియమించారు. వైస్ చైర్మన్‌గా కిశోర్ రెడ్డి, కన్వీనర్‌గా ఎం.ఎ. ఫహీమ్ నియమితులయ్యారు. అలాగే సభ్యులుగా ఎన్. భానుప్రకాష్ రెడ్డి, కేవీ ప్రసాద్, సురజ్ తివారి, సుదిని మహేందర్, అల్లం రాకేశ్‌ నియమితులయ్యారు.

తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రొటోకాల్-కోఆర్డినేషన్ కమిటీని పునర్‌వ్యవస్థీకరించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Advertisement
Advertisement