Minister Damodar Rajanarsimha | విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి దామోదర
Minister Damodar Rajanarsimha | రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువే సమాజంలో మార్పునకు నాంది పలుకుతుందని, అందుకే ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. చదువుతో ప్రజల్లో అవగాహన పెరిగి సామాజిక-ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
P
Pradeep Manthri
Telangana | Jan 19, 2026, 5.58 pm IST














