Revanth Reddy | తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా డిసెంబర్ 9: సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy | ప్రత్యేక తెలంగాణ (Telangana) ఏర్పాటు చేస్తున్నట్లు తొలిసారిగా అప్పటి కేంద్రప్రభుత్వం ప్రకటించిన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించనున్నట్లు సీఎం (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) వేదికగా రేవంత్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించారు.
గ్లోబల్ సమ్మిట్ వేదికగా వర్చువల్గా అన్ని కలెక్టరేట్లలో విగ్రహావిష్కరణ
Revanth Reddy | తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజైన డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ (Telangana) తల్లి అవతరణ దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. అదే రోజు సోనియాగాంధీ పుట్టిన రోజని, తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజని చెప్పారు. ఆ రోజు తెలంగాణకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఆ రోజు ప్రాధాన్యతను గుర్తించామని పేర్కొన్నారు. ఇది కలకాలం గుర్తుండిపోతుందన్నారు. తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ (Virtual) గా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణను మార్చామని చెప్పారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్లను ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మరిచిపోరని అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లో వారి స్ఫూర్తి కొనసాగుతుందని తెలిపారు. ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు, సోనియా గాంధీ జన్మదినోత్సవాలను తెలంగాణ ప్రజలు నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ ఆస్థిత్వానికి ప్రతీకగా, పరిపాలనకు స్ఫూర్తిదాయకంగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాలను అన్ని జిల్లాల పరిపాలన కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భమన్నారు.
33 జిల్లాల కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో విగ్రహాలు
రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆ నిధులను పారదర్శకంగా, సక్రమంగా వినియోగించి, నిర్ణీత గడువులోగా విగ్రహాలను తయారు చేయడంలో కృషి చేసిన అధికారులు, శిల్పులను అభినందించారు. అన్ని కలెక్టరేట్లలోనూ 18 అడుగుల ఎత్తుతో విగ్రహాలను నెలకొల్పామన్నారు. ఈ విగ్రహాల ఆవిష్కరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, రాష్ట్రంలో పెట్టబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



