త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | మూసీ భూములపై కాంగ్రెస్‌ కుట్ర‌: క‌విత‌

మూసీ (Musi) ప్ర‌క్షాళ‌న చేస్తామంటున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం దానిపై ఇప్పటివరకు డీపీఆర్‌ (DPR)ను విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) విమ‌ర్శించారు. పూర్తి డీపీఆర్‌ను విడుదల చేయకపోవడం వెనుక కుట్ర ఉంద‌ని, మూసీకి చెందిన భూములను ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

S

News | Published On Mar 15, 2026, 5.43 pm IST

Kavitha | మూసీ భూములపై కాంగ్రెస్‌ కుట్ర‌: క‌విత‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మూసీ (Musi) ప్ర‌క్షాళ‌న చేస్తామంటున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం దానిపై ఇప్పటివరకు డీపీఆర్‌ (DPR)ను విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) విమ‌ర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. పూర్తి డీపీఆర్‌ను విడుదల చేయకపోవడం వెనుక కుట్ర ఉంద‌ని, మూసీకి చెందిన భూములను ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి.. చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రా (Hydra) ను పెట్టి అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే వెంట‌నే డీపీఆర్‌ను విడుద‌ల చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

స‌రైన ప్ర‌ణాళిక‌లు లేకుండానే సీఎం రేవంత్ ముందుకెళ్ల‌డం ఆయ‌న అవివేకానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. పేద ప్ర‌జ‌ల ఇళ్ల‌ను కూల్చి చేసే అభివృద్ధి ఎవ‌రికి కావాల‌న్నారు. ఒక్క ఇంటిని కూల్చ‌కుండా మూసీ ప్ర‌క్షాళ‌న చేయాల‌ని సూచించారు. ఇళ్లు పేదోడి జీవిత క‌ష్టం అని ఆమె గుర్తు చేశారు.

Advertisement
Advertisement