Aadi Srinivas | వరికి బోనస్ ఇచ్చిందే కాంగ్రెస్.. కేసీఆర్కు ఆ ఆలోచనే రాలే: ఆది శ్రీనివాస్
Aadi Srinivas | వరికి బోనస్ (Bonus) ఇచ్చిందే కాంగ్రెస్ అని.. ఆ ఆలోచన కేసీఆర్(KCR) కు ఎప్పుడైనా వచ్చిందా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ధాన్యానికి బోనస్గా రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.3 వేల కోట్లు వేశామన్నారు. అసలు రైతులను ఎప్పుడూ కలవని కేసీఆర్కు వారు ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరని ఎద్దేవా చేశారు.
Aadi Srinivas | త్రినేత్ర.న్యూస్: వరికి బోనస్ (Bonus) ఇచ్చిందే కాంగ్రెస్ అని.. ఆ ఆలోచన కేసీఆర్(KCR) కు ఎప్పుడైనా వచ్చిందా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ధాన్యానికి బోనస్గా రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.3 వేల కోట్లు వేశామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. తరుగు పేరుతో రైతులను దోపిడీ చేశారని ఆరోపించారు. అసలు రైతులను ఎప్పుడూ కలవని కేసీఆర్కు వారు ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరని ఎద్దేవా చేశారు.
కవిత మాటలకు జవాబివ్వు..
రైతు ప్రయోజనాలకు కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఆలోచనతో పాటు, పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చాం. సారు బయటకి రారు.. ఎవరినీ కలవరు.. అని స్వయంగా కేసీఆర్ కూతురు కవితనే చెప్పారు. రాష్ట్ర రైతులను పట్టించుకోరని.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చెక్కులు ఇచ్చారని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ జవాబు చెప్తలేరు. పైగా కాంగ్రెస్ను తప్పు పడుతున్నారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రూ.2,800 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ప్రస్తుతం వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ పంజాబ్ను దాటింది. ఈ సీజన్లోనూ 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది అని శ్రీనివాస్ వివరించారు.
కాంగ్రెస్ను తప్పుపట్టడం దేనికి?
వరికి బోనస్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్కు ఎందుకు రాలే. కేవలం రైతుబంధు అమలు చేసి మిగతా పథకాలన్నీ ఆపేశారు. పంట నష్ట పరిహారం, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాతో పాటు గతంలో ఉన్న పథకాలన్నింటిని అమలు చేస్తోంది. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు వద్దనుకున్నారో వారే పోస్టుమార్టం చేసుకోవాలి. బీఆర్ఎస్ నేతలు ప్రజలనే తప్పు పట్టే పరిస్థితి ఉంది. కవిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పని కేసీఆర్ కాంగ్రెస్ను తప్పు పట్టడం విడ్డూరంగా ఉంది అని ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



