త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cancer Awareness Marathon | ఉత్సాహంగా క్యాన్స‌ర్ అవేర్‌నెస్ మార‌థాన్.. జెండా ఊపి ప్రారంభించిన‌ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

Cancer Awareness Marathon | హైద‌రాబాద్‌ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం గ్లోబ‌ల్ ఓర‌ల్ క్యాన్స‌ర్ అవేర్‌నెస్ మార‌థాన్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Minister Sridharbabu) ఘ‌నంగా ప్రారంభించారు. గ్లోబ‌ల్ ఓర‌ల్ క్యాన్స‌ర్ ట్ర‌స్ట్ (Global Oral Cancer Trust) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ మార‌థాన్‌లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

S

News | Published On Apr 26, 2026, 12.04 pm IST

Cancer Awareness Marathon | ఉత్సాహంగా క్యాన్స‌ర్ అవేర్‌నెస్ మార‌థాన్.. జెండా ఊపి ప్రారంభించిన‌ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు
Advertisement

Cancer Awareness Marathon | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం గ్లోబ‌ల్ ఓర‌ల్ క్యాన్స‌ర్ అవేర్‌నెస్ మార‌థాన్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Minister Sridharbabu) ఘ‌నంగా ప్రారంభించారు. గ్లోబ‌ల్ ఓర‌ల్ క్యాన్స‌ర్ ట్ర‌స్ట్ (Global Oral Cancer Trust) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ మార‌థాన్‌లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. స‌మాజంలో ఆరోగ్యవంత‌మైన చైత‌న్యాన్ని పెంపొందించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో మార్పు వ‌స్తుంద‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా వైద్యులు, యువత, నిపుణులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప‌రుగెత్తారు. ఇలాంటి కార్యక్రమాలు నోటి క్యాన్సర్ నిరోధం, తొలి దశలో వ్యాధి గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి త‌దిత‌ర వాటిపై ప్రజల్లో అవగాహన పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని శ్రీ‌ధ‌ర్‌బాబు పేర్కొన్నారు. ఆరోగ్యవంత‌మైన స‌మాజ నిర్మాణానికి ప్ర‌తి ఒక్కరూ సహ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు.

ప్రభుత్వం ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉందన్నారు. ప్రజా ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, నివారణాత్మక వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అనంత‌రం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను శ్రీ‌ధ‌ర్‌బాబు అభినందించారు.

Advertisement
Advertisement