Harish Rao | రేపే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ.. రాష్ట్ర ప్రజలకు హరీశ్రావు విషెస్
Harish Rao | కేసీఆర్ (KCR) నాయకత్వంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి హరీశ్రావు సిల్వర్ జూబ్లీ(Silver jubilee) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం దుద్దెడ(Duddeda) చౌడాలమ్మ ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ (KCR) నాయకత్వంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి హరీశ్రావు సిల్వర్ జూబ్లీ(Silver jubilee) శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. ఆదివారం దుద్దెడ(Duddeda) చౌడాలమ్మ ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లేదు.. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు.
దుద్దెడ చౌడాలమ్మ ఉత్సవాలకు రావడం సంతోషకరం..
హరీశ్రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. గుడి కమిటీ ఆహ్వానం మేరకు దుద్దెడ చౌడాలమ్మ దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం. ఈ పండుగ నిర్వహణ కోసం నా వంతుగా ఆర్థిక సహాయం అందజేశాను. గతంలో ఇక్కడి ప్రజల అవసరాల కోసం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం కేసీఆర్ రూ. 30 లక్షల నిధులు మంజూరు చేశారు అని హరీశ్రావు గుర్తు చేశారు.
బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు..
రేపు బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం (సిల్వర్ జూబ్లీ) జరుపుకోనున్న వేళ రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం నాలుగు కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చిన మహానాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ పుట్టడం వల్లే ఇవాళ దశాబ్దాల తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో, స్వయంపాలనలో ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అని ఉద్ఘాటించారు.
అంతా కేసీఆర్ కృషే..
ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా, 33 జిల్లాలుగా పరిపాలన సాగుతుందన్నా, మన సిద్దిపేట జిల్లా ఏర్పడిందన్నా అదంతా కేసీఆర్ కృషే. బీడువారిన ఈ నేలను ఇవాళ కాళేశ్వరం జలాలు ముద్దాడుతున్నాయి. అంటే దానికి కారణం తెలంగాణ రావడం, బీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల్లో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. నాటి ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది. తెలంగాణ సాధన కోసం నాలుగు కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చి, ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



