త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Women’s Reservation Bill Failed | లోక్‌సభలో వీగిపోయిన డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లు: మెజారిటీ సాధించడంలో ఎన్డీయే విఫలం

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన 2/3వ వంతు మెజారిటీ (326 ఓట్లు) రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.

J

National | Published On Apr 17, 2026, 8.30 pm IST

Women’s Reservation Bill Failed | లోక్‌సభలో వీగిపోయిన డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లు: మెజారిటీ సాధించడంలో ఎన్డీయే విఫలం
Advertisement

Women's Reservation Bill Failed | కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభలో తీవ్ర చుక్కెదురైంది. మహిళా రిజర్వేషన్ల (Women's Reservation) అమలును వేగవంతం చేయడంతో పాటు, కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపట్టేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కీలక బిల్లు వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఎన్డీయే (NDA) కూటమికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ రాకపోవడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ముందుకు సాగలేదు.

ఓటింగ్ వివరాలు: ఎంతమంది అనుకూలం? ఎంతమంది వ్యతిరేకం?

బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 326 ఓట్లు అవసరం. అయితే ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. అవసరమైన సంఖ్యాబలం రాకపోవడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును లోక్‌సభ నుంచి ఉపసంహరించుకున్నారు. అనంతరం సభను రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

అసలు ఈ బిల్లు ఉద్దేశం ఏంటి? విపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయి?

'నారీ శక్తి వందన్ అధినియం'కు సవరణలు చేస్తూ ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో ఈ "131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026"ను ప్రభుత్వం తీసుకువచ్చింది. 2029 నాటికి మహిళా కోటాను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఇందులో ప్రతిపాదించారు.  దీనికోసం కొత్త సెన్సస్‌తో సంబంధం లేకుండా గత జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేయాలని భావించారు.  డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 850 కి పెంచాలని ఈ బిల్లులో పొందుపరిచారు. అయితే, కొత్త జనాభా లెక్కలు లేకుండా ఈ ప్రక్రియ చేపట్టడాన్ని విపక్ష ఎంపీలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభలో ఆందోళనకు దిగారు.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

బిల్లు వీగిపోవడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హర్షం వ్యక్తం చేశారు. ఆయన పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. "మేము లోక్‌సభలో ఈ బిల్లును ఓడించాము. ఇది మహిళల అభ్యున్నతి కోసం తెచ్చిన బిల్లు కాదని, దేశ ఎన్నికల నిర్మాణాన్ని (Electoral structure) తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమని మేం మొదటి నుంచీ చెబుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత 2023 మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలా చేస్తే మొత్తం విపక్షాలు మీకు పూర్తి సహకారం అందిస్తాయి" అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement