త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu | విరుదున‌గ‌ర్‌లో బాణాసంచా ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. 17 మంది దుర్మ‌ర‌ణం..!

Tamil Nadu | విరుదునగర్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణాసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది మృతి చెందిన‌ట్లుగా స‌మాచారం.

P

National | Published On Apr 19, 2026, 5.36 pm IST

Tamil Nadu | విరుదున‌గ‌ర్‌లో బాణాసంచా ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. 17 మంది దుర్మ‌ర‌ణం..!
Advertisement

Tamil Nadu | విరుదునగర్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణాసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది మృతి చెందిన‌ట్లుగా స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురి మృత‌దేహాల‌ను అధికారికంగా తెలిపారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య క్రమంగా పెరిగితే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో వనజా బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భారీ శ‌బ్దం రావ‌డంతో ఒక్క‌సారిగా చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌న్నీ ఉలిక్కిప‌డ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే, పేలుడు తీవ్రత కారణంగా ఫ్యాక్టరీలోని నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్ర‌స్తుతం సంఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. బాణాసంచా తయారీకి విరుదునగర్ జిల్లా ప్ర‌సిద్ధి. శివ‌కాశి, స‌త్తూరు ప్రాంతాలు ఈ ప‌రిశ్ర‌మ‌కు కేంద్రంగా ఉన్నాయి. అయితే, ఇక్క‌డ ఫైర్ క్రాక‌ర్స్ ఫ్యాక్ట‌రీల్లో గ‌తంలోనూ పేలుళ్లు జ‌రిగాయి. అయితే, అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.

Advertisement
Advertisement