త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Terrorists | ఇద్ద‌రు జైషే ఉగ్ర‌వాదులు హ‌తం

Terrorists | జ‌మ్మూక‌శ్మీర్ కిష్టావ‌ర్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఇద్ద‌రు జైషే ఉగ్ర‌వాదుల‌ను భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. త్రాషి-1 ఆప‌రేష‌న్‌లో భాగంగా పాస‌ర్‌కుత్ ఏరియాలో ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌గా, ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు తార‌స‌ప‌డ్డారు.

S

National | Published On Feb 22, 2026, 4.17 pm IST

Terrorists | ఇద్ద‌రు జైషే ఉగ్ర‌వాదులు హ‌తం
Advertisement

Terrorists | త్రినేత్ర‌.న్యూస్ : జ‌మ్మూక‌శ్మీర్ కిష్టావ‌ర్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఇద్ద‌రు జైషే ఉగ్ర‌వాదుల‌ను భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. త్రాషి-1 ఆప‌రేష‌న్‌లో భాగంగా పాస‌ర్‌కుత్ ఏరియాలో ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌గా, ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు తార‌స‌ప‌డ్డారు. దీంతో వారిని బ‌ల‌గాలు కాల్చిచంపారు. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి రెండు ఏకే47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అయితే జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు పాస‌ర్‌కుత్ ఏరియాలో త‌ల‌దాచుకున్న‌ట్లు బ‌ల‌గాల‌కు నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. దాంతో అక్క‌డ కూంబింగ్ నిర్వ‌హించి ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టారు. ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు కాల్పులు జ‌రిపి వారిని అంత‌మొందించారు.

హ‌త‌మైన ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు పాకిస్తాన్ జాతీయులు అని పోలీసులు తేల్చారు. వీరిద్ద‌రు నిషేధిత జైషే మ‌హ‌మ్మ‌ద్ టెర్ర‌రిస్టు సంస్థ‌కు చెందిన సభ్యులు అని నిర్ధారించారు. ఉగ్ర‌వాదులు స్థానికంగా ఉన్న కొండ దిగువ‌న ఒక మ‌ట్టి ఇంటిలో దాక్కున్న‌ట్లు స‌మాచారం అందింది. దాంతో కూంబింగ్ నిర్వ‌హించి వారిని మ‌ట్టుబెట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగించే వారికి ఆశ్ర‌య‌మిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని పోలీసులు తేల్చారు.

Advertisement
Advertisement