త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TN CM Vijay | అమ్మ క్యాంటీన్లపై సీఎం విజయ్ సంచలన నిర్ణయం

తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే 'అమ్మ క్యాంటీన్ల' ఆధునీకరణకు అధికారులను ఆదేశించారు.

J

National | Published On May 18, 2026, 7.22 pm IST

TN CM Vijay | అమ్మ క్యాంటీన్లపై సీఎం విజయ్ సంచలన నిర్ణయం
Advertisement

TN CM Vijay | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలోని పేద, సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పారు. గత కొద్దికాలంగా నిర్వహణ లోపంతో సతమతమవుతున్న 'అమ్మ క్యాంటీన్ల' (Amma Canteens) రూపురేఖలు మార్చాలని సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని (Quality food) అందించేలా ఈ క్యాంటీన్లను వెంటనే ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు.

జయలలిత మానస పుత్రిక

2011-16 ఏఐఏడీఎంకే (AIADMK) ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత (J Jayalalithaa) ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అభిమానులు, పార్టీ శ్రేణులు ఆమెను ప్రేమగా పిలుచుకునే 'అమ్మ' పేరు మీదుగానే.. ఫిబ్రవరి 24, 2013న జయలలిత పుట్టినరోజు సందర్భంగా తొలిసారిగా చెన్నైలో ఈ అమ్మ క్యాంటీన్లను (స్థానికంగా అమ్మ ఉనవగం) ప్రారంభించారు. ఆ తర్వాత వీటికి వచ్చిన విశేష స్పందనతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలకు విస్తరించారు.

క్వాలిటీ లేదన్న ఫిర్యాదులతో రివ్యూ మీటింగ్

ఇటీవల కాలంలో ఈ క్యాంటీన్లలో ఆహారం నాణ్యత, రుచి ఆశించిన స్థాయిలో లేవని సీఎం విజయ్ దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, టాప్ అఫీషియల్స్‌తో (Top officials) ప్రత్యేక రివ్యూ మీటింగ్ (Review meeting) నిర్వహించారు. క్యాంటీన్లలో మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపరచాలని, వంటగదిలో అవసరమైన కొత్త పాత్రలు, ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం దొరికేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం తేల్చి చెప్పారు.

600కు పైగా క్యాంటీన్లు

ఒక అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (Greater Chennai Corporation) పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు ఉండగా, రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో మరో 237 క్యాంటీన్లు సేవలందిస్తున్నాయి. తాజా మోడర్నైజేషన్ (Modernisation) పనులతో ఈ క్యాంటీన్లకు మళ్లీ పాత వైభవం రానుందని, తక్కువ ధరకే కడుపునిండా భోజనం దొరుకుతుందని సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement