Digital System | మద్యం దుకాణాలకు డిజిటల్ హంగులు
Digital System | తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం విక్రయ సంస్థ టాస్మాక్ (TASMAC) కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ ఒకటి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో స్టాక్ ఆర్డర్ల కోసం ప్రస్తుతం ఉన్న పేపర్ పద్ధతికి స్వస్తి పలికి.. పూర్తిగా డిజిటల్ విధానాన్ని అమలు చేయబోతున్నది.
- సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు
- కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న తమిళనాడు టాస్మాక్
- హ్యాండ్హెల్డ్ పరికరాలతోనే మద్యం స్టాక్ ఆర్డర్లు..
- పేపర్ రహిత ప్రక్రియతో సరఫరాలో పారదర్శకత
Digital System | తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం విక్రయ సంస్థ టాస్మాక్ (TASMAC) కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ ఒకటి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో స్టాక్ ఆర్డర్ల కోసం ప్రస్తుతం ఉన్న పేపర్ పద్ధతికి స్వస్తి పలికి.. పూర్తిగా డిజిటల్ విధానాన్ని అమలు చేయబోతున్నది. దుకాణాల సూపర్వైజర్లు ప్రత్యేక హ్యాండ్హెల్డ్ పరికరాల ద్వారా స్టాక్ అవసరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ కే నందకుమార్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. స్టాక్ పంపిణీని క్రమబద్ధీకరించడం, కాగితపు పనిని తొలగించడం, సరఫరాలో జాప్యాలు, కొరతలను అధిగమించడం దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. తమిళనాడులోని 38 జిల్లాలు, డిపోలను ఎండ్ టు ఎండ్ కంప్యూటరీకరించే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. తాజా విధానంతో మానవ తప్పిదాలు, స్టాక్ నిర్వహణలో లోపాలకు మరింతగా అడ్డుకట్ట పడనుంది.
20 శాతం అదనంగా ఆర్డర్ చేసుకోవచ్చు..
కొత్త విధానంలో ప్రతి దుకాణానికి బ్రాండ్, ప్యాక్ పరిమాణం ఆధారంగా ఎంత స్టాక్ తీసుకోవాలో హ్యాండ్హెల్డ్ పరికరంలోనే ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఆ పరిమాణాన్ని సూపర్వైజర్లు తగ్గించడానికి వీలుండదు. స్థానికంగా డిమాండ్ అధికంగా ఉంటే నిర్ణయించిన పరిమాణానికి అదనంగా 20 శాతం వరకు ఆర్డర్ చేసుకోవచ్చు. వినియోగదారుల్లో ఆదరణ ఉన్న ఏదైనా బ్రాండ్ ఆటోమేటిక్ జాబితాలో లేకపోతే.. దానినీ స్థానిక డిమాండ్ ఆధారంగా జోడించే అవకాశం ఉంటుంది. స్టాక్ ఆర్డర్ను తుది దశలో సమర్పించేందుకు సూపర్వైజర్ నమోదిత మొబైల్ నంబర్కు వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ)తో ధ్రువీకరణ తప్పనిసరి.
డిపోకు నేరుగా సమాచారం..
ఇకపై జిల్లా మేనేజర్ కార్యాలయాలకు ఫిజికల్ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. డివైజ్లో పరిమాణాన్ని నిర్ధారించిన తర్వాత అదే తుది ఆర్డర్గా పరిగణించి స్థానిక డిపోకు పంపిస్తారు. అక్కడి నుంచి దుకాణాలకు స్టాక్ పంపిణీ జరుగుతుంది. దుకాణానికి చేరిన సరుకును సూపర్వైజర్ భౌతికంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంతో విక్రయాల వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావడంతో.. ఏ ప్రాంతంలో ఏ బ్రాండ్కు ఎంత డిమాండ్ ఉందన్నది స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో డిమాండ్కు తగ్గ బ్రాండ్లను దుకాణాలకు సరఫరా చేసే అవకాశం పెరుగుతుంది. ప్రస్తుతం డిజిటల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జిల్లా మేనేజర్లు సంతకం చేసిన ముద్రిత ప్రతులతో వ్యవస్థలోని వివరాలను సరిపోల్చి పరిశీలిస్తున్నారు. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం తప్పనిసరి కానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం
- ●Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
- ●PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్
- ●Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..
- ●Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ
- ●Minister Vivek | మియోషి మేయర్తో మంత్రి వివేక్ భేటీ

Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం

Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్

Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..






