త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu Delimitation | లోక్‌సభ సీట్ల పెంపునకు బ్రేక్.. కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక తీర్మానం

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఖిలపక్ష భేటీలో అసలేం జరిగిందంటే?

J

National | Published On Aug 8, 2026, 8.21 pm IST

Tamil Nadu Delimitation | లోక్‌సభ సీట్ల పెంపునకు బ్రేక్.. కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక తీర్మానం

సంక్షిప్త సారాంశం

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియను అడ్డుకుంటూ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం సి. జోసెఫ్ విజయ్ నిర్ణయించారు. కేంద్రం తలపెట్టిన ఈ ప్రక్రియ వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కనీసం మరో 40-50 ఏళ్ల పాటు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు వద్దని అఖిలపక్ష భేటీలో తీర్మానించారు. అధికార టీవీకే (TVK) కూటమి, కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన 19 మంది ఎంపీలు హాజరైన ఈ భేటీని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే బాయ్‌కాట్ చేసింది. ముందుగా కర్ణాటకలోని మేకెదాటు డ్యామ్‌పై కేంద్రంతో పోరాడాలని సీఎం విజయ్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి సవాల్ విసిరారు.

Advertisement

Tamil Nadu Delimitation | త్రినేత్ర.న్యూస్ : నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియను ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అధ్యక్షతన శనివారం జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకునేలా రాష్ట్ర అసెంబ్లీలో అధికారికంగా ఒక తీర్మానం (Resolution) ఆమోదించాలని నిర్ణయించారు.

మరో 50 ఏళ్లు నో చేంజ్

ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్‌సభ సీట్ల (543), రాష్ట్ర ఎంపీ సీట్ల (39) సంఖ్యను పర్మినెంట్‌గా ఫ్రీజ్ చేయాలని ఈ మీటింగ్‌లో ఏకగ్రీవంగా తీర్మానించారు. కనీసం మరో 40-50 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధుల సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు తీసుకురావొద్దని (Status quo) నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అమలు చేస్తే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం లేకుండా పోతుందని.. తమిళనాడు ప్రజల హక్కులను కాపాడేందుకు సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం గొప్పదని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి కొనియాడారు.

19 మంది ఎంపీల హాజరు

అధికార టీవీకే (TVK) పార్టీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, VCK, MDMK, IUML తో పాటు మద్దతిస్తున్న సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల నుంచి మొత్తం 19 మంది ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి విజయ్ చివర్లో ఆరు నిమిషాల పాటు ప్రసంగించారు. అయితే, రాష్ట్రంలో లోక్‌సభ సీట్ల పెంపును ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందో, ఆ బిల్లులో ఉన్న లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా సూచించారు.

మీటింగ్ బాయ్‌కాట్ చేసిన డీఎంకే

ఈ ప్రతిష్టాత్మక అఖిలపక్ష సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (DMK) బహిష్కరించింది. సీఎం విజయ్ ప్రాధాన్యతలను తప్పుబడుతూ.. డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కనిమొళి కరుణానిధి విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్‌పై చర్చలు పక్కనపెట్టి, ముందుగా కర్ణాటక ప్రతిపాదిస్తున్న 'మేకెదాటు ప్రాజెక్ట్' (Mekedatu dam) వివాదంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర జలశక్తి మంత్రితో పోరాడే దమ్ముందా? అని ఆమె సవాల్ విసిరారు. డీలిమిటేషన్ వల్ల పార్లమెంట్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గితే గతంలోలాగే తాము కూడా గట్టిగా వ్యతిరేకిస్తామని కనిమొళి స్పష్టం చేశారు.

డీఎంకే గైర్హాజరీపై సీఎం విజయ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసిన గొప్ప నాయకులు ఉన్న, ఆరుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఇలాంటి కీలక మీటింగ్‌కు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు.

అయితే, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచన ఉందని గానీ, ప్రస్తుత చట్టాన్ని సవరించే ప్రతిపాదన ఉందని గానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement