Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ వస్తుందా..? రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ఇటీవల ప్రతిష్టాత్మకంగా తొలి వందే భారత్ స్లీపర్ను విజయవంతంగా రైల్వేలో ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ హైస్పీడ్ రైలు పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి అసోంలోని గౌహతి (కామాఖ్య) వరకు రాకపోకలు సాగిస్తుంది.
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ఇటీవల ప్రతిష్టాత్మకంగా తొలి వందే భారత్ స్లీపర్ను విజయవంతంగా రైల్వేలో ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ హైస్పీడ్ రైలు పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి అసోంలోని గౌహతి (కామాఖ్య) వరకు రాకపోకలు సాగిస్తుంది. వారంలో ఐదురోజులు ఈ రైలు నడుస్తుంది. జనవరి 22 నుంచి రైలు సాధారణ సేవలు మొదలుకానున్నాయి. హౌరా నుంచి ఈ రైలు గురువారం మినహా అన్నిరోజుల్లో నడుస్తుండగా.. కామాఖ్య నుంచి బుధవారం మినహా మిగతా రోజుల్లో రాకపోకలు సాగిస్తుంది.
ఈ హైస్పీడ్ వందే భారత్ రైలు హౌరా-గౌహతి (కామాఖ్య) మధ్య ఉన్న 958 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ రైలుకు సంబంధించిన టికెట్ నిబంధనలు, రాయితీలు మాత్రం ఇతర రైళ్లతో పోలిస్తే భిన్నంగా ఉండనున్నాయి. ఈ స్లీపర్ రైలులో ఆర్ఏసీ (RAC) సౌకర్యం అందుబాటులో ఉండదు. అలాగే, మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, డ్యూటీ పాస్ హోలర్డ్స్కు మాత్రమే ప్రత్యేక కోటా అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకంగా రాయితీలు వర్తించవు. ఈ రైలులో కన్ఫర్మ్ అయిన టికెట్లతో మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. దాంతో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యం అందివ్వనున్నది. ఇదిలా ఉండగా.. ఏదైనా కారణంతో వందే భారత్ స్లీపర్ రైలు టికెట్లను రద్దు చేసుకుంటే రీఫండ్ వస్తుందా..? లేదా? అని ప్రయాణీకులు ఆరా తీస్తున్నారు.
రీఫండ్ రూల్స్ ఇవే..
కొత్త తీసుకువచ్చిన వందే భారత్ స్లీపర్ రైలులో టికెట్ను క్యాన్సిల్ చేస్తే ఎంత ఛార్జీలు విధిస్తారో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఏదైనా కారణంతో టికెట్లను రద్దు చేసుకుంటే రీఫండ్ వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన రీఫండ్ నిబంధనలను సాధారణ రైళ్ల కంటే చాలా కఠినంగా తీసుకువచ్చారు. ప్రయాణీకులకు రీఫండ్ ఖచ్చితంగా వస్తుంది. కానీ, దాని మొత్తం టిక్కెట్ను రైలు బయలుదేరడానికి ఎంత సమయం ముందు రద్దు చేసుకుంటారనే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం రైల్వేశాఖ మూడు వేర్వేరు సమయ పరిమితులను నిర్ణయించింది. టిక్కెట్ను ఎంత ఆలస్యంగా రద్దు చేసుకుంటే అంత కోత విధిస్తారు. దాంతో ప్రయాణీకుడు ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వస్తుంది.
వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ కన్ఫర్మ్ అయిన నుంచి రైలు బయలుదేరడానికి 72గంటల ముందు రద్దు చేస్తే చార్జీలో 25శాతం కోత విధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు డబ్బులు మొత్తం ఇవ్వరు. రైల్వే నిబంధనల ప్రకారం.. ఇలాంటి సందర్భాల్లో మొత్తం టికెట్ చార్జీలో 25శాతం కోత విధించి.. మిగతా మొతాన్ని ప్రయాణీకుడికి రీఫండ్గా చెల్లిస్తారు. అయితే, ఒక ప్రయాణికుడు వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణానికి మరికొద్ది సమయానికి ముందు తన ప్రణాళికలను మార్చుకుంటే.. రీఫండ్ మొత్తం మరింత తగ్గుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం.. రైలు బయలుదేరే సమయానికి 72 గంటల నుంచి 8 గంటల ముందు వరకు కన్ఫర్మ్ టిక్కెట్ను రద్దు చేస్తే.. రైల్వే మొత్తం ఛార్జీలో 50 శాతాన్ని కోత విధిస్తారు. ప్రయాణీకులకు కేవలం సగం మొత్తం మాత్రమే రీఫండ్గా వస్తుంది. రైలు బయలుదేరడానికి కంటే 8 గంటల కంటే తక్కువ సమయంలో టికెట్ను రద్దు చేసుకుంటే ఎలాంటి రీఫండ్ రాదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇతర రైళ్లలో నిర్ణీత ప్రయాణ సమయానికి నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధిలో రద్దు చేసుకుంటే రీఫండ్ ఇవ్వడం లేదు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






