త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | ప‌రువున‌ష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌

Rahul Gandhi | కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కోర్టులో ఊరట దక్కింది.

D

National | Published On Feb 21, 2026, 5.06 pm IST

Rahul Gandhi | ప‌రువున‌ష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌
Advertisement

Rahul Gandhi | కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కోర్టులో ఊరట దక్కింది. ప‌రువు న‌ష్టం కేసు (defamation case)లో మహారాష్ట్ర (Maharastra) లోని భివాండీ కోర్టు (Bhivandi court) ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌కు సంబంధించి కొత్త గ్యారంటీని దాఖ‌లు చేసేందుకు రాహుల్ ఇవాళ స్వ‌యంగా మెజిస్ట్రేట్ ముందు హాజ‌ర‌య్యారు. రాహుల్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్దన్ సక్పాల్ పూచీకత్తు ఇచ్చారు.

మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) హస్తం ఉందంటూ 2014లో రాహుల్‌గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో జ‌రిగిన ర్యాలీలో ఆయ‌న ఈ ఆరోప‌ణ‌లు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్య‌క‌ర్త‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆయ‌న వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ.. సంఘ్‌ కార్యకర్త రాజేష్‌ కుంటే భివాండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేశారు. ఈ కేసులోనే రాహుల్‌కు నేడు బెయిల్ మంజూరైంది.

Advertisement
Advertisement