త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Gandhi on Dharmendra Pradhan | దేశ యువత ముందు తలవంచిన సర్కార్.. ప్రధాన్ రాజీనామాపై ప్రియాంకా గాంధీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత సాధించిన చారిత్రక విజయం అన్నారు.

J

National | Published On Jul 25, 2026, 4.26 pm IST

Priyanka Gandhi on Dharmendra Pradhan | దేశ యువత ముందు తలవంచిన సర్కార్.. ప్రధాన్ రాజీనామాపై ప్రియాంకా గాంధీ
Advertisement
  • కేంద్ర మంత్రి రాజీనామా దేశ యువత పోరాటానికి దక్కిన విజయం
  • ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకుంటున్నారు
  • గాంధేయ మార్గంలో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ దాడులను ఎదుర్కొని మరీ యువత నిలబడ్డారు
  • గత 10-12 ఏళ్లుగా విద్యావ్యవస్థను RSS సిద్ధాంతాలతో నింపేస్తున్నారని మండిపాటు
  • పేపర్ లీక్స్‌పై గత రెండేళ్లుగా రాహుల్ గాంధీ నిరంతరం చేసిన పోరాటాన్ని గుర్తుచేసిన ప్రియాంక

Priyanka Gandhi on Dharmendra Pradhan | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వాయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జూలై 25, 2026 నాడు జరిగిన ఈ పరిణామం కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదని, దేశ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకునే ప్రయాణంలో తొలి అడుగు అని ఆమె అభివర్ణించారు. రాజ్యాంగాన్ని నాశనం చేయాలని.. ప్రజల గొంతు నొక్కాలని చూసిన వారిపై సాధించిన విజయమిదని ఆమె స్పష్టం చేశారు.

అహింసా మార్గంలో యువత విజయం

ఈ గెలుపు కచ్చితంగా దేశ యువత సాధించిన విజయమేనని.. వారందరినీ చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు. "మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలోనే విద్యార్థులు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారిపై పెల్లెట్ గన్స్ (Pellet guns), టియర్ గ్యాస్ ప్రయోగించారు.. లాఠీలతో కొట్టి తీవ్ర గాయాలపాలు చేశారు. అయినా యువత వెనక్కి తగ్గలేదు.. మోదీ ప్రభుత్వం వారి పట్టుదల ముందు తలవంచక తప్పలేదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల మాటే శాసనం

మన దేశంలో ఉన్నది డెమోక్రసీ (Democracy) అని, ఇక్కడ ప్రజల మాటే శాసనం అని ఈ ఘటన మరోసారి నిరూపించిందన్నారు. ఏ నియంత, ఏ శక్తీ దేశ ప్రజల సంకల్పాన్ని ఆపలేదని తేల్చి చెప్పారు. ఢిల్లీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా తమ హక్కుల కోసం పోరాడి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారని అభినందించారు.

రాహుల్ గాంధీ పోరాటం.. RSS పై ఫైర్

కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఎప్పుడూ అండగా నిలబడుతుందని ప్రియాంక స్పష్టం చేశారు. ముఖ్యంగా పేపర్ లీక్ (Paper leak), పరీక్షల వ్యవస్థలోని లోపాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత రెండు, మూడేళ్లుగా నిరంతరం గళం విప్పుతున్నారని గుర్తుచేశారు. NSUI, యూత్ కాంగ్రెస్‌లను ఏకం చేసి దేశవ్యాప్త ఉద్యమానికి ఆయన స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.

అదే సమయంలో మోదీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. "గత 10-12 ఏళ్లుగా విద్యావ్యవస్థను RSS భావజాలంతో నింపేస్తున్నారు. ప్రతి వైస్ చాన్సలర్ పోస్టును వారికే కట్టబెడుతున్నారు.. ఇదంతా చూసి మన యువత ఎప్పుడు మేల్కొంటుందా అని నేను చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఈరోజు యువత గళం విప్పడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. ఇక వారి గొంతును ఎవరూ నొక్కలేరు" అని ప్రియాంకా గాంధీ ఉద్వేగంగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement