త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | త‌మిళ‌నాడులో మార్పు మొద‌లైంది.. కోయంబ‌త్తూరు స‌భ‌లో ప్ర‌ధాని మోదీ

PM Modi | కోయంబత్తూర్‌లో జరిగిన ఎన్నికల స‌భ‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలకు పార్లమెంట్‌, అసెంబ్లీల్లో రిజర్వేషన్‌ కల్పించే బిల్లును వ్యతిరేకిస్తూ డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు దాన్ని రాజకీయంగా మార్చేశాయని ఆయన ఆరోపించారు.

P

National | Published On Apr 18, 2026, 9.35 pm IST

PM Modi | త‌మిళ‌నాడులో మార్పు మొద‌లైంది.. కోయంబ‌త్తూరు స‌భ‌లో ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | కోయంబత్తూర్‌లో జరిగిన ఎన్నికల స‌భ‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలకు పార్లమెంట్‌, అసెంబ్లీల్లో రిజర్వేషన్‌ కల్పించే బిల్లును వ్యతిరేకిస్తూ డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు దాన్ని రాజకీయంగా మార్చేశాయని ఆయన ఆరోపించారు. మోదీ మాట్లాడుతూ 2023లో మహిళా సాధికారత కోసం ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను పార్లమెంట్‌లో ఆమోదించామని గుర్తు చేశారు. ఈ నెల 16న మహిళా రిజర్వేషన్ అమలుకు దిశగా చారిత్రక అడుగు వేసినట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు పెద్ద సంఖ్యలో చ‌ట్ట‌సభల్లోకి రావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

అయితే, ఈ మంచి ప్రయత్నాన్ని కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని మోదీ విమర్శించారు. డీఎంకే, కాంగ్రెస్‌ కలిసి దీన్ని ద్వేష రాజకీయాలుగా మార్చేశాయని ఆరోపించారు. జనాభా లెక్కల ఆధారంగా తమిళనాడుకు మరిన్ని స్థానాలు రావాల్సి ఉన్నప్పటికీ డీఎంకే దాన్ని అడ్డుకుందని అన్నారు. నల్ల దుస్తులు ధ‌రించ‌డం ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చలేరని, ప్రజలకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రాజకీయ మార్పు ప్రారంభమైందని, ప్రజలు ఎన్డీఏకు మద్దతు ఇస్తూ డీఎంకేను తిరస్కరిస్తున్నారని మోదీ చెప్పారు. కోయంబత్తూరు అభివృద్ధి రాజకీయాలకు ఎప్పుడూ మద్దతుగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. డీఎంకేకు చెప్పుకోదగిన విజయాలు లేవని విమర్శించిన మోదీ, భయాలను సృష్టించడమే వారి పని అని అన్నారు. మహిళల ఎదుగుదల వారికి అసహనాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు అధికారాన్ని కేంద్రీకరించుకుంటున్నాయని ఆరోపించారు.

డీఎంకే పాలనలో అవినీతి, మాఫియా రాజకీయాలు పెరిగాయని మోదీ విమర్శించారు. తమిళనాడుపై ప్రతీకార రాజకీయ భావనతో కొన్ని వర్గాలు వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఒకవైపు ఒక కుటుంబ సంపద పెరిగిందని, మరోవైపు ప్రజలపై అప్పుల భారం భారీగా పెరిగిందని ఆరోపించారు. కుటుంబ రాజకీయాలే డీఎంకే సిద్ధాంతమని మోదీ వ్యాఖ్యానించారు. ఒకే కుటుంబం మీడియా, సినిమా, రాజకీయ రంగాల్లో ప్రభావం చూపుతోందని అన్నారు. కుటుంబంలోనే అధికారం కోసం పోటీ జరుగుతోందని, అది ప్రజల అభివృద్ధిని దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement
Advertisement