లోడ్ అవుతోంది...


PM Modi Flies Kite | త్రినేత్ర.న్యూస్ : సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, పిండివంటలు, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడం మాత్రమే కాదు.. పతంగులను ఎగురవేయడం కూడా. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు పతంగులను ఎగురవేయడంతోనే ప్రారంభం అవుతాయి. అందులో భాగంగానే దేశ ప్రధాని మోదీ సోమవారం నాడు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ 2026 ని అధికారికంగా ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి నది తీరంలో ఈ ఫెస్టివల్ని మోదీ జర్మన్ చాన్సెలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇద్దరూ కలిసి పతంగిని ఎగురవేశారు.

సబర్మతి ఆశ్రమంలో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం ఫ్రెడరిక్తో కలిసి ప్రధాని మోదీ సబర్మతి నదీ తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కైట్ ఫెస్టివల్ని ప్రారంభించి సరదాగా కాసేపు ఇద్దరూ కలిసి కైట్స్ని ఎగురవేశారు.

కైట్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన పతంగులను తయారు చేసిన మహిళలతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. ఫెస్టివల్ ప్రారంభం తర్వాత ఓపెన్ టాప్ వెహికిల్లో ఇద్దరూ కలిసి ఆ ప్రాంగణం అంతా తిరిగారు. ఇద్దరూ తమ చేతుల్లో పతంగులు పట్టుకొని వాటిని ఎగురవేస్తూ సరదాగా గడిపారు.

దాదాపు 50 దేశాల నుంచి ఈ కైట్ ఫెస్టివల్కు కైట్స్ తయారు చేసే ఆర్టిస్టులు హాజరయ్యారు. వాళ్లు తయారు చేసిన కైట్లను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి ఈ కైట్ ఫెస్టివల్కి ఔత్సాహికులు హాజరయ్యారు. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కైట్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు.

గత సంవత్సరం నిర్వహించిన ఫెస్టివల్కి సుమారు 4 లక్షల వరకు ప్రజలు హాజరు కాగా.. ఈ సారి అంతకంటే ఎక్కువ మంది సందర్శించే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కైట్ ఫెస్టివల్ ద్వారా గుజరాత్ టూరిజాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులను గుజరాత్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చేసేందుకే గుజరాత్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.






Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam