త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | రోజూ న‌మాజ్ చేయ‌డం కుద‌ర‌దు..! కార్తీక దీపం వివాదం కేసులో హైకోర్టు తీర్పును స‌మ‌ర్థించిన సుప్రీం..!

Supreme Court | తిరుప్పరకుండ్రం కార్తీక దీపం వివాదం కేసులో మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. రంజాన్‌, బ‌క్రీద్ సంద‌ర్భంగా కొండ‌పై ఉన్న నెల్లితోప్పు ప్రాంతంలో ముస్లింలు ప్రార్థ‌న‌లు చేసుకోవ‌చ్చ‌న్న కోర్టు.. ప్ర‌తీరోజు చేసేందుకు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేసింది.

P

National | Published On Feb 9, 2026, 3.41 pm IST

Supreme Court | రోజూ న‌మాజ్ చేయ‌డం కుద‌ర‌దు..! కార్తీక దీపం వివాదం కేసులో హైకోర్టు తీర్పును స‌మ‌ర్థించిన సుప్రీం..!
Advertisement

Supreme Court | తిరుప్పరకుండ్రం కార్తీక దీపం వివాదం కేసులో మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. రంజాన్‌, బ‌క్రీద్ సంద‌ర్భంగా కొండ‌పై ఉన్న నెల్లితోప్పు ప్రాంతంలో ముస్లింలు ప్రార్థ‌న‌లు చేసుకోవ‌చ్చ‌న్న కోర్టు.. ప్ర‌తీరోజు చేసేందుకు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. కొండపై ఉన్న నెల్లితోప్పు ప్రాంతంలో సికిందర్ బాద్షా ఔలియా దర్గా ఉంది. అయితే, కొండ పాదాల వ‌ద్ద సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఆల‌యం ఉంది. ఈ కొండ‌పైనే స్వామివారి నివాసంగా పేర్కొంటున్నారు. ఈ ఆల‌యానికి ఎంతో విశిష్ట‌త ఉంది. కొండపై ఒక దర్గా ఉండ‌డంతో ప్రార్థనలు, జంతుబలులు వివాదానికి దారి తీశాయి.

గ‌తేడాది అక్టోబ‌ర్‌లో మ‌ద్రాస్ హైకోర్టు త‌న ఉత్త‌ర్వుల్లో ఈ ప్రాంతంలో జంతుబ‌లుల‌ను నిషేధించింది. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దర్గాకు చెందిన ఒక ఇమామ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీబీ వరాలే ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వును సమతుల్యమైన ఉత్తర్వుగా అభివర్ణించింది. గతేడాది డిసెంబర్‌లో మద్రాస్ హైకోర్టు దర్గా సమీపంలోని దీప‌స్తంభం వ‌ద్ద దీపాలు వెలిగించడానికి అనుమతించింది. ఆ త‌ర్వాత పెద్ద వివాదం చెల‌రేగింది. అయితే, శాంతిభద్రతలు క్షీణిస్తాయంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేసేందుకు నిరాక‌రించింది. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వంపై హైకోర్టు ధిక్కార చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

కొండ‌పై రాతిస్తంభంపై దీపం వెలిగించుకోవ‌చ్చ‌ని జస్టిస్ జీ జయచంద్రన్‌, జస్టిస్‌ రామకృష్ణన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. డీఎంకే ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు, దర్గా కమిటీ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు తోసిపుచ్చింది. కార్తీక దీపాన్ని వెలిగించడానికి చట్టపరమైన అడ్డంకులు ఏమీ లేవ‌ని తేల్చి చెప్పింది. ఏడాదికోసారి కార్తీక మాసంలో జ‌రిగిన దీపారాధ‌న‌తో శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు త‌లెత్తుతుంద‌ని ప్ర‌భుత్వ చేసిన వాద‌న‌లు హాస్యాస్ప‌దమ‌ని చెప్పింది. దీపం వెలిగించడాన్ని నిషేధిస్తూ ఎలాంటి ఆగమ శాస్త్రాలు, బలమైన సాక్ష్యధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement