త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Muslim Quota | మహారాష్ట్రలో ముస్లిం కోటా ర‌ద్దు.. 11 ఏండ్ల నాటి రిజ‌ర్వేష‌న్ల‌ను కొట్టేసిన బీజేపీ స‌ర్కార్

Muslim Quota | విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వే షన్లను (Muslim Quota) మహారాష్ట్ర ప్ర‌భుత్వం (Maharashtra government) ర‌ద్దు చేసింది. 2014లో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లను ర‌ద్దు చేస్తూ బీజేపీ (BJP) స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

G

National | Published On Feb 19, 2026, 7.56 am IST

Muslim Quota | మహారాష్ట్రలో ముస్లిం కోటా ర‌ద్దు.. 11 ఏండ్ల నాటి రిజ‌ర్వేష‌న్ల‌ను కొట్టేసిన బీజేపీ స‌ర్కార్
Advertisement

Muslim Quota | త్రినేత్ర‌.న్యూస్‌: విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వే షన్లను (Muslim Quota) మహారాష్ట్ర ప్ర‌భుత్వం (Maharashtra government) ర‌ద్దు చేసింది. 2014లో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లను ర‌ద్దు చేస్తూ బీజేపీ (BJP) స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అయితే 12 ఏండ్ల క్రిత ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టికీ ఎప్పుడూ అమలు కాలేదు. 2014లో నాటి పృద్విరాజ్ చౌహాన్ ప్ర‌భుత్వం స్పెషల్‌ బ్లాక్‌వర్డ్‌ క్లాస్‌–ఏ (SBC-A) కేటగిరీ కింద రాష్ట్రంలోని ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అది చట్టరూపం దాల్చక‌పోవ‌డంతో ఆ రిజర్వేషన్లకు ఎప్పుడో కాలదోషం పట్టింది. కాగా, మ‌రాఠాల‌కు కూడా 16 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన‌ప్ప‌టికీ.. అది కూడా అమ‌లులోకి రాకుండానే పోయింది. తాజాగా వాటిని ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వం లాంఛనంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.

దీంతోపాటు ఎస్‌బీసీ–ఏ కేటగిరీ కింద రాష్ట్రంలో ముస్లింలకు కుల, నాన్‌ క్రీమీలేయర్‌ సర్టిఫికెట్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై 2014 నవంబర్‌లోనే బాంబే హైకోర్టు స్టే విధించింది. అయితే విద్యా సంస్థల్లో వాటిని అమలు చేసేందుకు మాత్రం అనుమతించింది. కానీ ఆ తర్వాత నెల రోజులకే ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసింది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేప ఈనేతృత్వంలో ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆ ఆర్డినెన్స్ చ‌ట్ట‌రూపం దాల్చ‌లేదు. దీంతో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కూడా అటకెక్కాయి. అయినా ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు కూడా ఆ రిజర్వేషన్లు చెల్లవని ప్రకటించింది.

కాగా, ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఫడ్నవీస్‌ సర్కారు మైనార్టీ వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని మాజీ సీఎం పృద్వీరాజ్ చ‌వాన్ విమ‌ర్శించారు. అజిత్ మ‌ర‌ణించిన త‌ర్వాత ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. నాడు ఆయ‌న ఉప‌ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇప్పుడు అజిత్ ప‌వార్ పార్టీ (NCP) ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేక‌మా అని మండిప‌డ్డారు.

 

Advertisement
Advertisement