Madras High Court | చిక్కుల్లో మాజీ మంత్రి బాలాజీ.. ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..!
Madras High Court | రూ.397 కోట్ల ట్రాన్స్ఫార్మర్ కుంభకోణంపై మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. కేసు విచారణ కోసం రెండువారాల్లో బృందాన్ని ఏర్పాటు చేయాలని సీబీఐకి సూచించింది. సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విజిలెన్స్లకు విజ్ఞప్తి చేసింది. విచారణతో మాజీ మంత్రి సెంటిల్ బాలాజీ చిక్కుల్లో పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Madras High Court | రూ.397కోట్ల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల కుంభకోణంలో మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నిర్ణయం తమిళనాడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. 2021 నుంచి 2023 మధ్య ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును స్వతంత్ర సంస్థతో విచారించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్ ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగం సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
రెండు వారాల్లోగా సీబీఐ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, విజిలెన్స్ విభాగం సీబీఐ దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలు తీవ్రమైనవని, రాజకీయాల నేపథ్యంలో వాటిని పక్కన పెట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఎన్జీవో అరప్పోర్ అయ్యక్కం సహా ప్రతిపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం మాజీ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్లో ఆరోపించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఇప్పటికే సెంథిల్ బాలాజీ కొద్దిరోజుల పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. తాజా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



