త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Onion Procurement Price | ఉల్లి రైతులకు గుడ్ న్యూస్: 13 శాతం పెరిగిన ధర

ఉల్లి పండించే రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. బఫర్ స్టాక్ కోసం ఉల్లి మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2,125కు పెంచుతూ నేడు కీలక నిర్ణయం తీసుకుంది.

J

National | Published On Jul 4, 2026, 3.41 pm IST

Onion Procurement Price | ఉల్లి రైతులకు గుడ్ న్యూస్: 13 శాతం పెరిగిన ధర
Advertisement
  • ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (PSF) కింద ఉల్లి సేకరణ ధరను కేంద్రం 13 శాతం పెంచింది
  • క్వింటాల్ ఉల్లి ధరను రూ.1,875 నుంచి రూ.2,125 కు సవరిస్తూ నిర్ణయం
  • పెరిగిన కొత్త ధరలు జూలై 4, 2026 నుంచే అమల్లోకి
  • 2025-26 సంవత్సరానికి గాను దేశంలో ఉల్లి ఉత్పత్తి 307.37 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా

Onion Procurement Price | త్రినేత్ర.న్యూస్ : ఉల్లి సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఆనియన్ బఫర్ స్టాక్ కోసం ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (PSF) కింద ఉల్లి ప్రొక్యూర్‌మెంట్ (మద్దతు) ధరను ఏకంగా 13 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 4, 2026 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు NAFED, NCCF ద్వారా ఈ బఫర్ స్టాక్ సేకరణ వేగంగా కొనసాగుతోంది.

మద్దతు ధరల వివరాలు

తాజా నిర్ణయంతో ఉల్లి రైతులకు తమ పంటకు మెరుగైన గిట్టుబాటు ధర లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఆనియన్ బఫర్ స్టాక్ కోసం ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద గతంలో ఉన్న క్వింటాల్ ఉల్లి మద్దతు ధరను రూ.1,875 నుంచి ఏకంగా 13 శాతం పెంచి, కొత్త ధరగా రూ.2,125 కు సవరించింది.

ఉత్పత్తి అంచనాలు, నిల్వలు

వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం.. 2025-26 సంవత్సరానికి గాను ఉల్లి ఉత్పత్తి 307.37 లక్షల మెట్రిక్ టన్నులుగా (LMT) ఉండవచ్చని అంచనా. ఇది 2024-25 నాటి 307.67 LMT ల ఉత్పత్తితో దాదాపు సమానం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉల్లి లభ్యతకు ఎలాంటి ఢోకా లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో సరిపడా స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశవ్యాప్తంగా రోజువారీ మండికి (Mandi arrivals) 50,000 మెట్రిక్ టన్నులకు పైగా వస్తున్నాయి. మహారాష్ట్రలో సగటు ధర కిలోకు సుమారు రూ.18 గా ఉంది. రిటైల్ మార్కెట్‌లో దేశవ్యాప్తంగా సగటు ధర ప్రస్తుతం కిలోకు రూ.31 పలుకుతోంది.

వాతావరణ ప్రభావం, మార్కెట్ ట్రెండ్స్

వర్షాలు ఆలస్యం కావడం, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కొంతమంది ట్రేడర్లు స్పెక్యులేటివ్ బయ్యింగ్ (అంచనాలతో కొనుగోలు చేయడం) కు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారుల మార్కెట్లలో సెంటిమెంట్ ఎలా ఉన్నా.. నాసిక్, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో భవిష్యత్తులో మార్కెట్ పుంజుకుంటుందన్న ఆశతో ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ జరుగుతోంది.

పంటల సాగు, ఎగుమతుల పరిస్థితి

మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఖరీఫ్ విత్తనాలు చల్లడం దాదాపు 15 రోజులు ఆలస్యమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ, చల్లకెరె ప్రాంతాల్లో విత్తనాల ప్రక్రియ సాధారణ స్థాయిలో 60 శాతం మాత్రమే పూర్తయింది. జూన్ 2026 నాటికి సుమారు 1.50 LMT ల ఉల్లి ఎగుమతులు జరిగాయి. అయితే.. పాకిస్థాన్, చైనా నుంచి గల్ఫ్, శ్రీలంక, ఫార్ ఈస్ట్ (ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఆసియా) దేశాలకు తక్కువ ధరకు కొత్త పంట వస్తుండటంతో.. రానున్న రోజుల్లో మన ఎగుమతుల వేగం కాస్త తగ్గే అవకాశం ఉందని ట్రేడర్లు భావిస్తున్నారు.

Advertisement
Advertisement