త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Election Commission | బెంగాల్‌, త‌మిళ‌నాడులో 48 గంట‌లు డ్రై డే.. ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న‌

Election Commission | స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడులో 48 గంట‌ల పాటు డ్రై డే అమ‌లు చేయాల‌ని సోమ‌వారం ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

P

National | Published On Apr 20, 2026, 6.39 pm IST

Election Commission | బెంగాల్‌, త‌మిళ‌నాడులో 48 గంట‌లు డ్రై డే.. ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న‌
Advertisement

Election Commission | స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడులో 48 గంట‌ల పాటు డ్రై డే అమ‌లు చేయాల‌ని సోమ‌వారం ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ ముగియడానికి ముందు 48 గంటల వ్యవధిలో పోలింగ్ ప్రాంతాల్లో మద్యం విక్రయం, సరఫరా, పంపిణీ పూర్తిగా నిషేధం ఉంటుంద‌ని స్పష్టం చేసింది. హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క్ల‌బ్స్‌, మ‌ద్యం దుకాణాలు స‌హా అన్ని ప్ర‌దేశాల్లో ఈ నిషేధం అమ‌లులో ఉంటుంద‌ని పేర్కొంది. స్టార్ హోటల్స్‌, ప్రైవేట్ క్ల‌బ్స్‌, రెస్టారెంట్లు వంటి లైసెన్స్ ఉన్న సంస్థల్లోనూ ఈ స‌మ‌యంలో మ‌ద్యం విక్ర‌యాల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

పోలింగ్ జరిగే ప్రతి దశలోనూ, అలాగే అవసరమైతే జరిగే రీపోలింగ్ సమయంలోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. మే 4న జరిగే ఓట్ల లెక్కింపు రోజున కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సమయంలో లైసెన్స్ లేకుండా మద్యం నిల్వ చేస్తే కఠిన చర్యలుంటాయ‌ని హెచ్చ‌రించింది. ఇదిలా ఉండ‌గా.. త‌మిళ‌నాడులో ఈ నెల 23న పోలింగ్ జ‌రుగ‌నుండ‌గా.. ప‌శ్చిమ బెంగాల్‌లో 23, 29 తేదీల్లో పోలింగ్ జ‌రుగ‌నుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మే 4న ఓట్ల లెక్కింపు జ‌రుగ‌నుంది. ఓటర్లపై అనవసర ప్రభావం లేకుండా చూసేందుకు, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వివ‌రించింది.

Advertisement
Advertisement