త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన ‘నీట్’ మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ

కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా, కేసుల మాఫీ, నష్టపరిహారంపై కేంద్రం దిగిరావడంతో.. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనను విరమిస్తున్నట్లు CJP ప్రకటించింది.

J

National | Published On Jul 25, 2026, 5.58 pm IST

CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన ‘నీట్’ మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ
Advertisement
  • నీట్ విద్యార్థుల పక్షాన పోరాడుతున్న 'CJP' ప్రధాన డిమాండ్లకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నెరవేరిన ఆందోళనకారుల తొలి డిమాండ్
  • నిరసనకారులపై పెట్టిన FIRల ఎత్తివేతకు, బాధితులకు నష్టపరిహారానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన చర్చల అనంతరం ఆందోళనను విరమిస్తున్నట్లు CJP ప్రకటన

CJP Protest Withdrawn | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వేదికగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఉద్రిక్త ఆందోళనలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. నీట్ (NEET) పరీక్షల రద్దు, పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల తరపున పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తమ నిరసనను విరమిస్తున్నట్లు (Protest Withdrawn) అధికారికంగా ప్రకటించింది. కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

CJP Withdraws Protest After Centre Accepts Key NEET Demands

నెరవేరిన ప్రధాన డిమాండ్లు

కేంద్ర ప్రభుత్వంతో మూడు విడతలుగా జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయని CJP జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా (Ashutosh Ranka) వెల్లడించారు. తమ ప్రధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పటికే జరిగిపోయిందని ఆయన గుర్తుచేశారు.

CJP Withdraws Protest After Centre Accepts Key NEET Demands

FIR ల ఎత్తివేతకు ఓకే

ఢిల్లీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో నిరసనకారులు, ఆర్గనైజర్లపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను (FIRs) ఉపసంహరించుకోవాలనే రెండో డిమాండ్ కు కూడా కేంద్రం అంగీకరించిందని CJP నేత సౌరవ్ దాస్ (Saurav Das) తెలిపారు. భవిష్యత్తులో కూడా తమపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందని.. మంగళవారం నాటికి దీనిపై ఒక రాతపూర్వక గ్యారెంటీ (Written Guarantee) డాక్యుమెంట్ అందనుందని ఆయన వివరించారు.

CJP Withdraws Protest After Centre Accepts Key NEET Demands

బాధితులకు నష్టపరిహారం

కేంద్ర మంత్రులు జేపీ నడ్డా (JP Nadda), జితేంద్ర సింగ్ (Jitendra Singh) లతో కలిసి CJP ప్రతినిధులు ఢిల్లీలో జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నీట్ వ్యవహారంలో తీవ్ర మనోవేదనతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ నష్టపరిహారం (Compensation) అందిస్తామని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం CJP ఇచ్చిన 5-పాయింట్ల చార్టర్ ను కూడా తీవ్రంగా పరిగణిస్తున్నామని.. రాబోయే రోజుల్లో దీనిపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు.

శాంతియుతంగా ఇంటికి వెళ్లండి

ప్రభుత్వం తమ డిమాండ్లన్నింటినీ సానుభూతితో అర్థం చేసుకుని ఆమోదించిందని, అందుకే తక్షణమే ఈ ఆందోళనను విరమిస్తున్నామని CJP నేతలు ప్రకటించారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరినందున.. నిరసనకారులంతా శాంతియుతంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని వారు పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఆందోళనకు తెరపడినట్లయింది.

Advertisement
Advertisement