త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TN Polls | ఎన్డీయే కూట‌మిలో చేరండి.. టీవీకే విజ‌య్‌కే బీజేపీ పిలుపు..!

TN Polls | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, టీవీకే చీఫ్ విజయ్‌ని ఎన్డీయే కూటమిలో చేరాలని బీజేపీ కోరింది. అలా జరిగితే డీఎంకే వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండే అవకాశం ఉందని పార్టీ అభిప్రాయ‌ప‌డింది.

P

National | Published On Mar 8, 2026, 3.14 pm IST

TN Polls | ఎన్డీయే కూట‌మిలో చేరండి.. టీవీకే విజ‌య్‌కే బీజేపీ పిలుపు..!
Advertisement

TN Polls | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, టీవీకే చీఫ్ విజయ్‌ని ఎన్డీయే కూటమిలో చేరాలని బీజేపీ కోరింది. అలా జరిగితే డీఎంకే వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండే అవకాశం ఉందని పార్టీ అభిప్రాయ‌ప‌డింది. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి.

ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి..

తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఏఎన్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు డీఎంకే చిన్నపాటి పార్టీలు, సంస్థలను తమ కూటమిలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ఇది అధికార పార్టీకి ఎన్నికల ఫలితాలపై ఉన్న ఆందోళనను సూచిస్తోందన్నారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను కూడా ప్రసాద్ ప్రస్తావించారు. ముఖ్యంగా రాజ్యసభ సీటును డీఎండీకేకు కేటాయించిన నిర్ణయం కూటమిలోని పాత భాగస్వామ్య పార్టీల్లో కొంత అసంతృప్తి కలిగించిందని సమాచారం ఉందన్నారు. ఇందులో వీసీకే, వామపక్ష పార్టీలు కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అధికార పార్టీకి ఆందోళ‌న‌

చట్టవ్యవస్థ సమస్యలు, ద్రవ్యోల్బణం, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై తమిళనాడు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని బీజేపీ నేత అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల అభిప్రాయాన్ని ఈ అంశాలు ప్రభావితం చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయన అభిప్రాయపడ్డారు. డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ శక్తులు కలిసి పనిచేయాలని, లేకపోతే వ్యతిరేక ఓట్లు విడిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఆ ప్ర‌య‌త్నాల‌కు మ‌రింత బ‌లం..

ఈ నేపథ్యంలో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు ప్రసాద్ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. ఏఐఏడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో చేతులు కలపాలని కోరారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడం అడ్డుకోవడమే విజయ్ లక్ష్యమైతే విస్తృత ప్రతిపక్ష కూటమిలో చేరడం ఆ ప్రయత్నాన్ని బలపరుస్తుందని ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు విడిపోయి పోటీ చేస్తే అది పరోక్షంగా అధికార పార్టీకి లాభం చేకూర్చే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, గత ఎన్నికల ధోరణులను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాతే కూటమి విషయంలో నిర్ణయం తీసుకోవాలని విజయ్‌కు సూచించారు. డీఎంకేకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదికపై ఐక్యంగా నిలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికార కూటమికి గట్టి పోటీ ఇవ్వగలమని ప్రసాద్ తెలిపారు.

Advertisement
Advertisement